Political News

మోడీకి పర్ ఫెక్ట్ ట్వీట్ పంచ్ అంటే ఇదేనేమో?

విమర్శల మీద విమర్శలు చేసుకుంటూ పోయే కన్నా.. చేసేదేదో దిమ్మ తిరిగిపోయేలా వేస్తే.. దాని లెక్కే వేరుగా ఉంటుంది. దేశ ప్రజల మీద గడిచిన ఇరవై రెండు రోజులుగా మొహమాటం లేని రీతిలో ఆయిల్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. పెట్రోల్.. డీజిల్ ధరల్ని భారీగా పెంచేస్తున్న వైనం తెలిసిందే. ఇలాంటివేళ.. విపక్షాలు మొదలు పలు సంస్థలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక.. సామాన్యుడి వేదన అంతా ఇంతా కాదు.

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు కనిష్ఠంగా ఉన్నప్పటికి.. లీటరు పెట్రోల్.. డీజిల్ ధరలు రూ.80ను దాటేస్తున్న పరిస్థితి. ఇలాంటివేళ.. మోడీసర్కారుపై తనకున్న ఆగ్రహాన్ని.. పెట్రోల్.. డీజిల్ ధరల పెరుగుదల తీరును తప్పు పట్టేందుకు నెటిజన్ ఒకరు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ ఈ ట్వీట్ గొప్పతనం ఏమంటే.. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం మోడీ ట్విట్టర్ ఖాతా నుంచి పోస్టు అయ్యింది. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన.. అప్పటి యూపీఏ సర్కారు పెంచిన పెట్రోల్.. డీజిల్ ధరలను తప్పు పడుతూ.. ట్వీట్ సంధించారు. పెట్రోల్ ధరల్ని పెంచటం కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న యూపీఏ సర్కారు వైఫల్యమని.. గుజరాత్ లోని కోట్లాది మందికి ఇదో పెను భారంగా మారుతుందన్న ఆవేదనను వ్యక్తం చేశారు మోడీ అప్పట్లో.

ఇప్పుడు అదే ట్వీట్ కు కేవలం మూడంటే మూడుమార్పులు చేస్తూ.. నెటిజన్ ఒకరు దాన్ని పోస్టు చేశారు. కాంగ్రెస్ స్థానంలో బీజేపీ.. యూపీఏ స్థానంలో ఎన్ డీఏ.. గుజరాత్ స్థానంలో ఇండియా పదాల్ని చేర్చటం ద్వారా.. మోడీ అప్పటి ఆవేదనను గుర్తు చేస్తూ.. మరిప్పటి సంగతేమిటంటూ సంధించిన ట్వీట్ తో కేంద్రానికి దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చారని చెప్పాలి. ఒకప్పటి మోడీ ట్వీట్ తోనే.. తాజాగా ఆయన సర్కారు నిర్ణయాన్ని తప్పుపట్టేసిన వైనం అందరిని ఆకర్షిస్తోందని చెప్పాలి.

This post was last modified on June 29, 2020 11:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

32 minutes ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

34 minutes ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

1 hour ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

3 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

3 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago