Political News

మోడీకి పర్ ఫెక్ట్ ట్వీట్ పంచ్ అంటే ఇదేనేమో?

విమర్శల మీద విమర్శలు చేసుకుంటూ పోయే కన్నా.. చేసేదేదో దిమ్మ తిరిగిపోయేలా వేస్తే.. దాని లెక్కే వేరుగా ఉంటుంది. దేశ ప్రజల మీద గడిచిన ఇరవై రెండు రోజులుగా మొహమాటం లేని రీతిలో ఆయిల్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. పెట్రోల్.. డీజిల్ ధరల్ని భారీగా పెంచేస్తున్న వైనం తెలిసిందే. ఇలాంటివేళ.. విపక్షాలు మొదలు పలు సంస్థలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక.. సామాన్యుడి వేదన అంతా ఇంతా కాదు.

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు కనిష్ఠంగా ఉన్నప్పటికి.. లీటరు పెట్రోల్.. డీజిల్ ధరలు రూ.80ను దాటేస్తున్న పరిస్థితి. ఇలాంటివేళ.. మోడీసర్కారుపై తనకున్న ఆగ్రహాన్ని.. పెట్రోల్.. డీజిల్ ధరల పెరుగుదల తీరును తప్పు పట్టేందుకు నెటిజన్ ఒకరు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ ఈ ట్వీట్ గొప్పతనం ఏమంటే.. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం మోడీ ట్విట్టర్ ఖాతా నుంచి పోస్టు అయ్యింది. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన.. అప్పటి యూపీఏ సర్కారు పెంచిన పెట్రోల్.. డీజిల్ ధరలను తప్పు పడుతూ.. ట్వీట్ సంధించారు. పెట్రోల్ ధరల్ని పెంచటం కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న యూపీఏ సర్కారు వైఫల్యమని.. గుజరాత్ లోని కోట్లాది మందికి ఇదో పెను భారంగా మారుతుందన్న ఆవేదనను వ్యక్తం చేశారు మోడీ అప్పట్లో.

ఇప్పుడు అదే ట్వీట్ కు కేవలం మూడంటే మూడుమార్పులు చేస్తూ.. నెటిజన్ ఒకరు దాన్ని పోస్టు చేశారు. కాంగ్రెస్ స్థానంలో బీజేపీ.. యూపీఏ స్థానంలో ఎన్ డీఏ.. గుజరాత్ స్థానంలో ఇండియా పదాల్ని చేర్చటం ద్వారా.. మోడీ అప్పటి ఆవేదనను గుర్తు చేస్తూ.. మరిప్పటి సంగతేమిటంటూ సంధించిన ట్వీట్ తో కేంద్రానికి దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చారని చెప్పాలి. ఒకప్పటి మోడీ ట్వీట్ తోనే.. తాజాగా ఆయన సర్కారు నిర్ణయాన్ని తప్పుపట్టేసిన వైనం అందరిని ఆకర్షిస్తోందని చెప్పాలి.

This post was last modified on June 29, 2020 11:56 am

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

1 hour ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago