అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్ తెరంగేట్రం చేసి అప్పుడే 20 ఏళ్లు అయిపోయింది. ఈ సందర్భంగా అతను తన కెరీర్లో కీలక మలుపులు, విశేషాల గురించి ‘రోడ్ టు 20’ పేరుతో ఒక సిరీస్ లాగా వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనను హీరోగా పరిచయం చేయమని ఎంతోమంది దర్శకులు, నిర్మాతలను అడిగి నిరాశ పడాల్సి వచ్చిందని వెల్లడించాడు.
చివరికి జేపీ దత్తా ‘రెఫ్యూజీ’తో తనను హీరోగా లాంచ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇదిలా ఉంటే అభిషేక్ ఇప్పుడు మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తన కూతురు ఆద్య ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో తాను ఎన్నో సినిమాలు వదులుకున్నట్లు చెప్పాడు. చిన్న అమ్మాయి అయిన ఆద్య కోసం అభిషేక్ సినిమాలు వదులుకోవడం ఏంటన్న సందేహం కలుగుతోంది కదా. దీనికి అతను బదులిచ్చాడు.
తాను సినిమాల్లో ఇంటిమేట్ సీన్లు చేస్తే.. ఆద్యకు ఊహ తెలిశాక అవి చూసి ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో చాలా సినిమాలు వదులుకున్నట్లు అభిషేక్ వెల్లడించాడు. ఎనిమిదేళ్ల కిందట ఆద్య పుట్టినప్పటి నుంచి తాను సినిమాల్లో అలాంటి సన్నివేశాల్లో నటించడం లేదని అతను తెలిపాడు. రేప్పొద్దున ఆద్య తాను హీరోయిన్లతో చేసిన గాఢమైన శృంగార సన్నివేశాలు చూసి ఏంటివని అడిగితే తాను ఏం సమాధానం చెప్పాలని అనిపించిందని.. అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించడం మానేశానని అభిషేక్ వెల్లడించాడు.
తనను పాత్రల కోసం దర్శకులు కలిసినపుడు.. ఇలాంటి సీన్లు ఏమైనా ఉంటే తాను చేయలేనని.. వేరే ప్రత్యామ్నాయాలు చూసుకోవచ్చని మర్యాదపూర్వకంగానే చెప్పేశానని.. ఇలా ఎన్నో సినిమాలు వదులుకున్నానని.. కానీ అందుకు ఎంతమాత్రం పశ్చాత్తాపపడట్లేదని.. ఇకముందూ ఇదే పాలసీని కొనసాగిస్తానని చెప్పాడు అభిషేక్.
This post was last modified on June 29, 2020 12:02 pm
రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…
వేసవి సీజన్లో కొంచెం ముందుగానే రేసులోకి దిగింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. కానీ ఈ చిత్రం టాలీవుడ్కు శుభారంభాన్ని అందించలేకపోయింది.…
మావిగన్.. నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న పదం. ఇప్పటిదాకా ఎన్నడూ వినని ఈ పదం…
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…