అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్ తెరంగేట్రం చేసి అప్పుడే 20 ఏళ్లు అయిపోయింది. ఈ సందర్భంగా అతను తన కెరీర్లో కీలక మలుపులు, విశేషాల గురించి ‘రోడ్ టు 20’ పేరుతో ఒక సిరీస్ లాగా వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనను హీరోగా పరిచయం చేయమని ఎంతోమంది దర్శకులు, నిర్మాతలను అడిగి నిరాశ పడాల్సి వచ్చిందని వెల్లడించాడు.
చివరికి జేపీ దత్తా ‘రెఫ్యూజీ’తో తనను హీరోగా లాంచ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇదిలా ఉంటే అభిషేక్ ఇప్పుడు మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తన కూతురు ఆద్య ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో తాను ఎన్నో సినిమాలు వదులుకున్నట్లు చెప్పాడు. చిన్న అమ్మాయి అయిన ఆద్య కోసం అభిషేక్ సినిమాలు వదులుకోవడం ఏంటన్న సందేహం కలుగుతోంది కదా. దీనికి అతను బదులిచ్చాడు.
తాను సినిమాల్లో ఇంటిమేట్ సీన్లు చేస్తే.. ఆద్యకు ఊహ తెలిశాక అవి చూసి ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో చాలా సినిమాలు వదులుకున్నట్లు అభిషేక్ వెల్లడించాడు. ఎనిమిదేళ్ల కిందట ఆద్య పుట్టినప్పటి నుంచి తాను సినిమాల్లో అలాంటి సన్నివేశాల్లో నటించడం లేదని అతను తెలిపాడు. రేప్పొద్దున ఆద్య తాను హీరోయిన్లతో చేసిన గాఢమైన శృంగార సన్నివేశాలు చూసి ఏంటివని అడిగితే తాను ఏం సమాధానం చెప్పాలని అనిపించిందని.. అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించడం మానేశానని అభిషేక్ వెల్లడించాడు.
తనను పాత్రల కోసం దర్శకులు కలిసినపుడు.. ఇలాంటి సీన్లు ఏమైనా ఉంటే తాను చేయలేనని.. వేరే ప్రత్యామ్నాయాలు చూసుకోవచ్చని మర్యాదపూర్వకంగానే చెప్పేశానని.. ఇలా ఎన్నో సినిమాలు వదులుకున్నానని.. కానీ అందుకు ఎంతమాత్రం పశ్చాత్తాపపడట్లేదని.. ఇకముందూ ఇదే పాలసీని కొనసాగిస్తానని చెప్పాడు అభిషేక్.
This post was last modified on June 29, 2020 12:02 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…