అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్ తెరంగేట్రం చేసి అప్పుడే 20 ఏళ్లు అయిపోయింది. ఈ సందర్భంగా అతను తన కెరీర్లో కీలక మలుపులు, విశేషాల గురించి ‘రోడ్ టు 20’ పేరుతో ఒక సిరీస్ లాగా వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనను హీరోగా పరిచయం చేయమని ఎంతోమంది దర్శకులు, నిర్మాతలను అడిగి నిరాశ పడాల్సి వచ్చిందని వెల్లడించాడు.
చివరికి జేపీ దత్తా ‘రెఫ్యూజీ’తో తనను హీరోగా లాంచ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇదిలా ఉంటే అభిషేక్ ఇప్పుడు మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తన కూతురు ఆద్య ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో తాను ఎన్నో సినిమాలు వదులుకున్నట్లు చెప్పాడు. చిన్న అమ్మాయి అయిన ఆద్య కోసం అభిషేక్ సినిమాలు వదులుకోవడం ఏంటన్న సందేహం కలుగుతోంది కదా. దీనికి అతను బదులిచ్చాడు.
తాను సినిమాల్లో ఇంటిమేట్ సీన్లు చేస్తే.. ఆద్యకు ఊహ తెలిశాక అవి చూసి ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో చాలా సినిమాలు వదులుకున్నట్లు అభిషేక్ వెల్లడించాడు. ఎనిమిదేళ్ల కిందట ఆద్య పుట్టినప్పటి నుంచి తాను సినిమాల్లో అలాంటి సన్నివేశాల్లో నటించడం లేదని అతను తెలిపాడు. రేప్పొద్దున ఆద్య తాను హీరోయిన్లతో చేసిన గాఢమైన శృంగార సన్నివేశాలు చూసి ఏంటివని అడిగితే తాను ఏం సమాధానం చెప్పాలని అనిపించిందని.. అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించడం మానేశానని అభిషేక్ వెల్లడించాడు.
తనను పాత్రల కోసం దర్శకులు కలిసినపుడు.. ఇలాంటి సీన్లు ఏమైనా ఉంటే తాను చేయలేనని.. వేరే ప్రత్యామ్నాయాలు చూసుకోవచ్చని మర్యాదపూర్వకంగానే చెప్పేశానని.. ఇలా ఎన్నో సినిమాలు వదులుకున్నానని.. కానీ అందుకు ఎంతమాత్రం పశ్చాత్తాపపడట్లేదని.. ఇకముందూ ఇదే పాలసీని కొనసాగిస్తానని చెప్పాడు అభిషేక్.
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…
అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…
ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…
పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు…
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…