భారతీయ థియేటర్లలో బొమ్మ పడి వంద రోజులు దాటిపోయింది. ఇంకో వంద రోజుల పాటు థియేటర్లు తెరుచుకోకపోయినా ఆశ్చర్యం లేదు. ఐతే ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని దేశాల్లో దశల వారీగా థియేటర్లను తెరుస్తున్నారు. నెల కిందటే కోవిడ్ ఫ్రీ కంట్రీగా మారిన న్యూజిలాండ్లో ఇప్పటికే థియేటర్లు తెరుచుకున్నాయి. పక్కనే ఉన్న ఆస్ట్రేలియాలో కూడా కరోనా ప్రభావం బాగా తగ్గడంతో థియేటర్లను పున:ప్రారంభించారు.
ఈ రెండు దేశాల్లో ఇండియన్ సినిమాలకు బాగా గిరాకీ ఉంటుంది. గత కొన్నేళ్లలో మన సినిమాలు ఆ దేశాల్లో ఇరగాడేశాయి. మిలియన్ల కొద్దీ వసూళ్లు రాబట్టాయి. ఆ దేశాల్లోని భారతీయ ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వెళ్లి సినిమా వినోదంలో మునిగి తేలాలనుకుంటున్నారు. కానీ కొత్త సినిమాలు ఏవీ అక్కడ రిలీజ్ చేసే పరిస్థితి లేదు. దీంతో పాత చిత్రాల్నే థియేటర్లలోకి దింపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
బాలీవుడ్ల్ మాస్ ఎంటర్టైన్మెంట్కు పెట్టింది పేరు రోహిత్ శెట్టి సినిమాలు. అతడి సినిమాలకు థియేటర్లలో సందడి మామూలుగా ఉండదు. ఇప్పుడు లాక్ డౌన్కు బ్రేక్ వేసి థియేటర్లకు వస్తున్న ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి అతడి సినిమాలు రెడీ అవుతున్నాయి. ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో రోహిత్ బ్లాక్బస్టర్ కామెడీ మూవీ ‘గోల్మాల్ అగైన్’ రిలీజ్ అవుతుండగా.. న్యూజిలాండ్లో అతడి మరో బ్లాక్బస్టర్ ‘సింబా’ (టెంపర్ రీమేక్) రిలీజ్ కాబోతోంది.
వీటికి వచ్చే స్పందనను బట్టి మరిన్ని సినిమాలను ఈ రెండు దేశాల్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేరే భాషల్లో కూడా కొత్త సిినిమాలు ఏ దేశంలోనూ ఇప్పుడు రిలీజ్ చేసే పరిస్థితి లేదు. కరోనా భయం పూర్తిగా తొలగిపోయే వరకు ఇలా పాత సినిమాల్ని నడిపించుకోవాల్సిందే. క్రిస్టోఫర్ నోలన్ కొత్త చిత్రం ‘టెనెట్’ను ముందు ఈ నెలలోనే విడుదల చేయాలనుకున్నారు. తర్వాత రెండుసార్లు డేట్లు మార్చారు.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…