భారతీయ థియేటర్లలో బొమ్మ పడి వంద రోజులు దాటిపోయింది. ఇంకో వంద రోజుల పాటు థియేటర్లు తెరుచుకోకపోయినా ఆశ్చర్యం లేదు. ఐతే ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని దేశాల్లో దశల వారీగా థియేటర్లను తెరుస్తున్నారు. నెల కిందటే కోవిడ్ ఫ్రీ కంట్రీగా మారిన న్యూజిలాండ్లో ఇప్పటికే థియేటర్లు తెరుచుకున్నాయి. పక్కనే ఉన్న ఆస్ట్రేలియాలో కూడా కరోనా ప్రభావం బాగా తగ్గడంతో థియేటర్లను పున:ప్రారంభించారు.
ఈ రెండు దేశాల్లో ఇండియన్ సినిమాలకు బాగా గిరాకీ ఉంటుంది. గత కొన్నేళ్లలో మన సినిమాలు ఆ దేశాల్లో ఇరగాడేశాయి. మిలియన్ల కొద్దీ వసూళ్లు రాబట్టాయి. ఆ దేశాల్లోని భారతీయ ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వెళ్లి సినిమా వినోదంలో మునిగి తేలాలనుకుంటున్నారు. కానీ కొత్త సినిమాలు ఏవీ అక్కడ రిలీజ్ చేసే పరిస్థితి లేదు. దీంతో పాత చిత్రాల్నే థియేటర్లలోకి దింపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
బాలీవుడ్ల్ మాస్ ఎంటర్టైన్మెంట్కు పెట్టింది పేరు రోహిత్ శెట్టి సినిమాలు. అతడి సినిమాలకు థియేటర్లలో సందడి మామూలుగా ఉండదు. ఇప్పుడు లాక్ డౌన్కు బ్రేక్ వేసి థియేటర్లకు వస్తున్న ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి అతడి సినిమాలు రెడీ అవుతున్నాయి. ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో రోహిత్ బ్లాక్బస్టర్ కామెడీ మూవీ ‘గోల్మాల్ అగైన్’ రిలీజ్ అవుతుండగా.. న్యూజిలాండ్లో అతడి మరో బ్లాక్బస్టర్ ‘సింబా’ (టెంపర్ రీమేక్) రిలీజ్ కాబోతోంది.
వీటికి వచ్చే స్పందనను బట్టి మరిన్ని సినిమాలను ఈ రెండు దేశాల్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేరే భాషల్లో కూడా కొత్త సిినిమాలు ఏ దేశంలోనూ ఇప్పుడు రిలీజ్ చేసే పరిస్థితి లేదు. కరోనా భయం పూర్తిగా తొలగిపోయే వరకు ఇలా పాత సినిమాల్ని నడిపించుకోవాల్సిందే. క్రిస్టోఫర్ నోలన్ కొత్త చిత్రం ‘టెనెట్’ను ముందు ఈ నెలలోనే విడుదల చేయాలనుకున్నారు. తర్వాత రెండుసార్లు డేట్లు మార్చారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…