అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ.80 కోట్లు పెట్టి ఈ సినిమాను నిర్మిస్తే.. థియేటర్ల నుంచి అందులో పావు వంతు కూడా వెనక్కి రాలేదు. కలెక్షన్ల సంగతి పక్కన పెట్టి, కంటెంట్ గురించి మాట్లాడకుంటే.. ఇందులో హీరో క్యారెక్టర్ దగ్గర్నుంచి ఏదీ వర్కవుట్ కాలేదు.
సుకుమారంగా కనిపించే అఖిల్ను వైల్డ్ బీస్ట్గా ప్రెజెంట్ చేయాలన్న ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. తన లుక్, యాక్టింగ్ ఏదీ అస్సలు సూట్ కాలేదు. ఇప్పుడు స్వయంగా అఖిలే తన క్యారెక్టర్, యాక్టింగ్ విషయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు. ఆ సినిమాను తనను చూస్తే తనకే అసహ్యం కలిగినట్లు అఖిల్ ఒక పాడ్కాస్ట్లో వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ సినిమా ఫలితమేంటో రష్ ఎడిట్ రూంలోనే అర్థమైపోయిందని, ఆ విషయాన్ని ఓపెన్గా తన సన్నిహితులతో చెప్పానని అఖిల్ వెల్లడించాడు.
‘‘విడుదలకు ముందు మన సినిమా చూసుకున్నపుడు అదెలా ఉందో, దానికి ఎలాంటి ఫలితం వస్తుందో అర్థమైపోతుంది. ‘ఏజెంట్’ సినిమాను నేను చూసుకున్నపుడే ఏదో తేడాగా ఉందని అర్థమైంది. కామన్ ఫ్రెండ్స్కు ఓపెన్గా విషయం చెప్పేశా. సినిమా తేడా కొట్టేలా ఉందని అన్నాను. కానీ ఆ పరిస్థితుల్లో దాన్ని కాపాడడానికి నేనేం చేయగలనని ఆలోచించా. దేవుడా ఏదైనా మార్గం ఉంటే చెప్పమని వేడుకున్నా. ఎందుకంటే నిర్మాత అన్ని కోట్లు పెట్టాక సినిమా కోసం నిలబడడం మన బాధ్యత. అందుకే నేను చేయగలిగింది చేశా.
ఒక సినిమా ఫెయిల్యూర్కు వంద కారణాలుండొచ్చు. అందులో మన బాధ్యత ఎంత అన్నది కూడా చూడాలి. ఆ సినిమాలో నేను సరిగా నటించలేదు. అందులో నన్ను నేను చూసుకుంటే నాకు అసహ్యమేసింది. ప్రతి సీన్లోనూ ఓవర్ రియాక్ట్ అయినట్లు కనిపించింది. బైక్ ఫస్ట్ గేర్లో పెట్టి విపరీతంగా రైజ్ చేస్తే ఎలా ఉంటుందో నా నటన అలా సాగింది’’ అంటూ ఏజెంట్లో తప్పుల గురించి కుండబద్దలు కొట్టేశాడు అఖిల్. ఐతే ఈ ఫెయిల్యూర్కు ఏ ఒక్కరినో నిందించలేమంటూ అందరం సమానంగా క్రెడిట్ తీసుకోవాల్సిందే అని అఖిల్ ఇంతకుముందే వ్యాఖ్యానించాడు.
This post was last modified on July 26, 2026 6:51 am
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…