Political News

నందిగ్రామ్ లో పోటీవెనుక ప్రధాన కారణం ఇదేనా ?

తాజాగా పశ్చిమబెంగాల్లో జరిగిన ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా మమతాబెనర్జీ తీసుకున్న నిర్ణయమే పార్టీ గెలుపుకు కారణం అయ్యిందా ? క్షేత్రస్ధాయిలో జరిగిన విషయాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. సంవత్సతరాలుగా పోటీచేస్తున్న భవానీపూర్ నియోజకవర్గాన్ని కాదని మమత నందిగ్రామ్ లో నామినేషన్ వేశారు. నందిగ్రామ్ లో పోటీ చేయటమంటే చాలా పెద్ద సాహసం చేయటమన్న విషయం దీదీకి బాగా తెలుసు. అయినా సాహసం చేశారు కాబట్టే విజయం సిద్ధించింది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఒకప్పటి మద్దతుదారులు, ప్రస్తుత ప్రత్యర్ధి అయిన సుబేందు అధికారి సొంత నియోజకవర్గం నందిగ్రామ్. సుబేందు కుటుంబం యావత్తు చాలాకాలంగా మమత మద్దతుదారులుగానే ఉన్నారు. ఈ కుటుంబానికి నందిగ్రామ్ ప్రాంతంలో విపరీతమైన పట్టుంది. సుమారు 35 నియోజకవర్గంలో సుబేందు కుటుంబాన్ని కాదని ఇంకెవరు ఇక్కడే గెలిచే ఛాన్సులేదు. ఈ ప్రాంతాల్లో రాజకీయంగా, ఆర్ధికంగా, వ్యాపారా రంగాల్లో సుబేందు కుటుంబానికి తిరుగులేదనే చెప్పాలి.

ఎందుకంటే సుబేందు కుటుంబంలో ఇద్దరు ఎంపిలు, పలువురు ఎంఎల్ఏలు, మున్సిపల్ ఛైర్మన్లుగా ఉన్నారు. ఇలాంటి నందిగ్రామ్ లో సుబేందు చాలెంజ్ చేయగానే వెంటనే నామినేషన్ వేసేయటానికి దీదీ ఏమి పిచ్చిదికాదు. కానీ ఇక్కడ పోటీ చేయటం వెనుక దీదీకి చాలా లోతైన ఆలోచనే ఉంది. అదేమిటంటే తాను నందిగ్రామ్ లో పోటీచేయకపోతే ఈ ప్రాంతమంతా సుబేందు కుటుంబం కారణంగా బీజేపీ అభ్యర్ధులు గెలవటం ఖాయం. అదే మమత నందిగ్రామ్ లో పోటీచేస్తే తనను ఓడించటానికి మొత్తం కుటుంబమంతా తన ఓటమికోసం నందిగ్రామ్ లోనే ఉంటారని మమతకు బాగా తెలుసు.

ఊహించినట్లుగానే నందిగ్రామ్ లో నామినేషన్ వేయగానే మమత ఓటమికి యావత్ సుబేందు కుటుంబమంతా ఇక్కడే క్యాంపు వేసింది. నందిగ్రామ్ లో మమతను ఓడించటమంటే తృణమూల్ ను ఓడించటమన్న అంచనాకు సుబేందు కుటుంబం వచ్చింది. దాంతో నామినేషన్ వేసిన తర్వాత సుబేందు కానీ ఆయన కుటుంబసభ్యులు కానీ ఇతర బీజేపీ అభ్యర్ధుల విజయంపై పెద్దగా దృష్టి పెట్టలేకపోయారట. అంటే దీదీ ఆలోచించినట్లుగానే సరిగ్గా జరిగింది.

మమత మాత్రం నందిగ్రామ్ లో నామినేషన్ వేసి రాష్ట్రమంతా తిరిగేశారు. నందిగ్రామ్ లో మమత పోటీ చేయకపోతే సుబేందు కూడా నామినేషన్ వేసి ఇతర ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్ధుల విజయం కోసం హ్యాపీగా ప్రచారానికి తిరిగేవారే. కానీ ఇపుడు మమతపై తాను గెలవటమే టార్గెట్ గా నందిగ్రామ్ వదిలి సుబేందు ఎక్కడా తిరగలేకపోయారు. దాంతో మమత ప్లాన్ సూపర్ సక్సెస్ అయ్యింది. మమత ఓడిపోయినా ఇతర నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించుకున్నారు. ఇదే సమయంలో మమతపై సుబేందు గెలిచినా ఇతర నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధులను గెలిపించుకోలేకపోయారు.  

This post was last modified on May 4, 2021 8:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

45 minutes ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

48 minutes ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

3 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

3 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago