Political News

నందిగ్రామ్ లో పోటీవెనుక ప్రధాన కారణం ఇదేనా ?

తాజాగా పశ్చిమబెంగాల్లో జరిగిన ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా మమతాబెనర్జీ తీసుకున్న నిర్ణయమే పార్టీ గెలుపుకు కారణం అయ్యిందా ? క్షేత్రస్ధాయిలో జరిగిన విషయాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. సంవత్సతరాలుగా పోటీచేస్తున్న భవానీపూర్ నియోజకవర్గాన్ని కాదని మమత నందిగ్రామ్ లో నామినేషన్ వేశారు. నందిగ్రామ్ లో పోటీ చేయటమంటే చాలా పెద్ద సాహసం చేయటమన్న విషయం దీదీకి బాగా తెలుసు. అయినా సాహసం చేశారు కాబట్టే విజయం సిద్ధించింది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఒకప్పటి మద్దతుదారులు, ప్రస్తుత ప్రత్యర్ధి అయిన సుబేందు అధికారి సొంత నియోజకవర్గం నందిగ్రామ్. సుబేందు కుటుంబం యావత్తు చాలాకాలంగా మమత మద్దతుదారులుగానే ఉన్నారు. ఈ కుటుంబానికి నందిగ్రామ్ ప్రాంతంలో విపరీతమైన పట్టుంది. సుమారు 35 నియోజకవర్గంలో సుబేందు కుటుంబాన్ని కాదని ఇంకెవరు ఇక్కడే గెలిచే ఛాన్సులేదు. ఈ ప్రాంతాల్లో రాజకీయంగా, ఆర్ధికంగా, వ్యాపారా రంగాల్లో సుబేందు కుటుంబానికి తిరుగులేదనే చెప్పాలి.

ఎందుకంటే సుబేందు కుటుంబంలో ఇద్దరు ఎంపిలు, పలువురు ఎంఎల్ఏలు, మున్సిపల్ ఛైర్మన్లుగా ఉన్నారు. ఇలాంటి నందిగ్రామ్ లో సుబేందు చాలెంజ్ చేయగానే వెంటనే నామినేషన్ వేసేయటానికి దీదీ ఏమి పిచ్చిదికాదు. కానీ ఇక్కడ పోటీ చేయటం వెనుక దీదీకి చాలా లోతైన ఆలోచనే ఉంది. అదేమిటంటే తాను నందిగ్రామ్ లో పోటీచేయకపోతే ఈ ప్రాంతమంతా సుబేందు కుటుంబం కారణంగా బీజేపీ అభ్యర్ధులు గెలవటం ఖాయం. అదే మమత నందిగ్రామ్ లో పోటీచేస్తే తనను ఓడించటానికి మొత్తం కుటుంబమంతా తన ఓటమికోసం నందిగ్రామ్ లోనే ఉంటారని మమతకు బాగా తెలుసు.

ఊహించినట్లుగానే నందిగ్రామ్ లో నామినేషన్ వేయగానే మమత ఓటమికి యావత్ సుబేందు కుటుంబమంతా ఇక్కడే క్యాంపు వేసింది. నందిగ్రామ్ లో మమతను ఓడించటమంటే తృణమూల్ ను ఓడించటమన్న అంచనాకు సుబేందు కుటుంబం వచ్చింది. దాంతో నామినేషన్ వేసిన తర్వాత సుబేందు కానీ ఆయన కుటుంబసభ్యులు కానీ ఇతర బీజేపీ అభ్యర్ధుల విజయంపై పెద్దగా దృష్టి పెట్టలేకపోయారట. అంటే దీదీ ఆలోచించినట్లుగానే సరిగ్గా జరిగింది.

మమత మాత్రం నందిగ్రామ్ లో నామినేషన్ వేసి రాష్ట్రమంతా తిరిగేశారు. నందిగ్రామ్ లో మమత పోటీ చేయకపోతే సుబేందు కూడా నామినేషన్ వేసి ఇతర ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్ధుల విజయం కోసం హ్యాపీగా ప్రచారానికి తిరిగేవారే. కానీ ఇపుడు మమతపై తాను గెలవటమే టార్గెట్ గా నందిగ్రామ్ వదిలి సుబేందు ఎక్కడా తిరగలేకపోయారు. దాంతో మమత ప్లాన్ సూపర్ సక్సెస్ అయ్యింది. మమత ఓడిపోయినా ఇతర నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించుకున్నారు. ఇదే సమయంలో మమతపై సుబేందు గెలిచినా ఇతర నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధులను గెలిపించుకోలేకపోయారు.  

This post was last modified on May 4, 2021 8:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

26 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago