Political News

సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు కోల్పోయిన మోడీ.. ఏం జ‌రిగిందంటే!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప్ర‌భ మ‌స‌క బారుతోంద‌నేందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌.. మ‌రొక‌టి చోటు చేసుకుంది. బెంగాల్‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌ల్లో బీజేపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. మోడీపై అనేక విమ‌ర్శ లు వ‌చ్చాయి. అయితే.. దానిపై నోరు మెద‌ప‌ని .. బీజేపీ నాయ‌కుల‌కు ఇప్పుడు మ‌రో పెద్ద షాక్ త‌గిలింది. ఏకంగా ప్ర‌ధాని మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న యూపీలోని వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గంలోను, అదే సమయంలో బీజేపీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న అయోధ్య‌లోనూ.. ఆ పార్టీకి ఎదురు గాలి జోరు గా వీచింది.

ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా చ‌తికిల‌ప‌డింది. ఇక్క‌డ ప్ర‌తిప‌క్షం, అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాది పార్టీ(ఎస్‌పీ) సత్తా చాటుకుంది. మోడీ సొంత నియోజ‌క‌వ‌ర్గం వారణాసిలోని 40 జిల్లా పంచాయతీ సీట్లకు జ‌రిగిన ఎన్నిక‌ల్లో 15 సీట్లలో ఎస్‌పీ గెలుపొందింది. బీజేపీ కేవలం 8 సీట్లు సాధించింది. ఇక‌, అయోధ్యలో 40 జిల్లా పంచాయతీ సీట్లకు గాను 24 సీట్లు సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకోగా, బీజేపీ కేవలం 6 సీట్లకు పరిమితమైంది. వాస్త‌వానికి ఇక్క‌డ రామమందిరానికి ప్ర‌ధాని మోడీ.. స్వ‌యంగా శంకుస్తాప‌న చేశారు. దీంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు త‌మ‌వైపే ఉంటార‌ని అనుకున్నారు. కానీ, బెడిసి కొట్టింది. ఇక్క‌డ‌ తక్కిన 10 సీట్లలో మాయావతి సారథ్యంలోని బీఎస్‌పీ 5, ఇండిపెండెంట్లు 5 గెలుచుకున్నారు.

కాగా, ఈ ఎన్నికల ఫలితాలపై బీజేపీ ప్రతినిధి ఒకరు ఆచితూచి వ్యాఖ్యానించారు. పార్టీకి ఊహించని ఫలితాలు రావడానికి కారణాలపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందని అన్నారు. పార్టీ క్యాడర్‌ ఆగ్రహంతో ఉండటం, తిరుగుబాటు అభ్యర్థుల సంఖ్య కూడా పార్టీ ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపించినట్టు పార్టీ సీనియర్ కార్యకర్త ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు చాలాకాలంగా సమస్యలు వినిపిస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని, తాజా ఫలితాలు ఒక హెచ్చరిక సంకేతమని ఆయన అన్నారు.

ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఉంది. ఇచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో బీజేపీ ప‌రాజ‌యం ఆ పార్టీని తీవ్ర‌స్థాయిలో ఇబ్బందిలోకి నెట్టేసిందనేది నిజం. పార్టీ కార్యకర్తలతో మంత్రులు మమేకం కాక‌పోవ‌డం, నేతలు, కార్యకర్తల మధ్య ఏర్పడిన అగాధం, మోడీ హ‌వా త‌మ‌ను నిల‌బెడుతుంద‌న్న అతి విశ్వాసం.. వంటివి.. అటు బీజేపీని, ఇటు మోడీని కూడా బద్నాం చేస్తున్నాయ‌నేది వాస్తవం అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on May 4, 2021 7:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

46 minutes ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

6 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

6 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

7 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

7 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

8 hours ago