ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ప్రభ మసక బారుతోందనేందుకు ప్రత్యక్ష ఉదాహరణ.. మరొకటి చోటు చేసుకుంది. బెంగాల్, తమిళనాడు, కేరళల్లో బీజేపీ ఘోర పరాజయం తర్వాత.. మోడీపై అనేక విమర్శ లు వచ్చాయి. అయితే.. దానిపై నోరు మెదపని .. బీజేపీ నాయకులకు ఇప్పుడు మరో పెద్ద షాక్ తగిలింది. ఏకంగా ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని వారణాసి నియోజకవర్గంలోను, అదే సమయంలో బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అయోధ్యలోనూ.. ఆ పార్టీకి ఎదురు గాలి జోరు గా వీచింది.
ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా చతికిలపడింది. ఇక్కడ ప్రతిపక్షం, అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్వాది పార్టీ(ఎస్పీ) సత్తా చాటుకుంది. మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలోని 40 జిల్లా పంచాయతీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో 15 సీట్లలో ఎస్పీ గెలుపొందింది. బీజేపీ కేవలం 8 సీట్లు సాధించింది. ఇక, అయోధ్యలో 40 జిల్లా పంచాయతీ సీట్లకు గాను 24 సీట్లు సమాజ్వాదీ పార్టీ గెలుచుకోగా, బీజేపీ కేవలం 6 సీట్లకు పరిమితమైంది. వాస్తవానికి ఇక్కడ రామమందిరానికి ప్రధాని మోడీ.. స్వయంగా శంకుస్తాపన చేశారు. దీంతో ఇక్కడి ప్రజలు తమవైపే ఉంటారని అనుకున్నారు. కానీ, బెడిసి కొట్టింది. ఇక్కడ తక్కిన 10 సీట్లలో మాయావతి సారథ్యంలోని బీఎస్పీ 5, ఇండిపెండెంట్లు 5 గెలుచుకున్నారు.
కాగా, ఈ ఎన్నికల ఫలితాలపై బీజేపీ ప్రతినిధి ఒకరు ఆచితూచి వ్యాఖ్యానించారు. పార్టీకి ఊహించని ఫలితాలు రావడానికి కారణాలపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందని అన్నారు. పార్టీ క్యాడర్ ఆగ్రహంతో ఉండటం, తిరుగుబాటు అభ్యర్థుల సంఖ్య కూడా పార్టీ ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపించినట్టు పార్టీ సీనియర్ కార్యకర్త ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు చాలాకాలంగా సమస్యలు వినిపిస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని, తాజా ఫలితాలు ఒక హెచ్చరిక సంకేతమని ఆయన అన్నారు.
ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఇచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ పరాజయం ఆ పార్టీని తీవ్రస్థాయిలో ఇబ్బందిలోకి నెట్టేసిందనేది నిజం. పార్టీ కార్యకర్తలతో మంత్రులు మమేకం కాకపోవడం, నేతలు, కార్యకర్తల మధ్య ఏర్పడిన అగాధం, మోడీ హవా తమను నిలబెడుతుందన్న అతి విశ్వాసం.. వంటివి.. అటు బీజేపీని, ఇటు మోడీని కూడా బద్నాం చేస్తున్నాయనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on May 4, 2021 7:34 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…