Trends

ఇండియాలో ప్రపంచకప్ ఉండదా?

మొత్తానికి కరోనా ధాటికి ఐపీఎల్ అర్ధంతరంగా ఆగిపోయింది. మళ్లీ మ్యాచ్‌లు ఎప్పుడుంటాయో తెలియట్లేదు. ఐపీఎల్ వాయిదా పడటమే భారత క్రికెట్ అభిమానులకు రుచించని విషయం అంటే.. దాన్ని మించిన చేదు వార్త ఒకటి వినిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబరు-నవంబరు నెలల్లో భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను ఇక్కడి నుంచి తరలించబోతున్నారన్నదే ఆ వార్త.

గత ఏడాది ఆస్ట్రేలియాలో ఈ టోర్నీ జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా దాన్ని రద్దు చేసి 2022కు వాయిదా వేశారు. ఈ ఏడాది భారత్‌లో జరగాల్సిన తర్వాతి ప్రపంచకప్‌ను యధావిధిగా నిర్వహించాలనుకున్నారు. చివరగా 2016లో పొట్టి కప్పు భారత్ వేదికగానే జరిగింది. ఆ తర్వాత 2018లో జరగాల్సిన టోర్నీ అనివార్య కారణాలతో రద్దయింది. 2020 టోర్నీని వాయిదా వేశారు. 2021 టోర్నీని యధావిధిగా భారత్‌లో నిర్వహించాలనుకున్నారు. ఇలా ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇండియాలోనే టీ20 ప్రపంచకప్ జరగబోతోందని మన అభిమానులు సంతోషించారు.

కానీ ఇప్పుడు చూస్తే భారత్‌లో టోర్నీ జరగడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. టోర్నీకి ఇంకో నాలుగు నెలలే టై ఉంది. ప్రస్తుతం ఇండియాలో కరోనా ఎలా విలయ తాండవం చేస్తోందో తెలిసిందే. ఇంకొన్ని నెలల పాటు కరోనా ప్రభావం పెద్దగా తగ్గేట్లు లేదు. ఐపీఎల్ సజావుగా సాగి ఉంటే ప్రపంచకప్‌ను ఇండియాలో నిర్వహించడంపై ఆశలుండేవి. కానీ ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ.. టోర్నీని మధ్యలో ఆపేయక తప్పట్లేదు.

ఇండియాలో కరోనా మూడో వేవ్ కూడా ఉంటుందన్న నిపుణుల అంచనాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ను ఇక్కడ నిర్వహించే సాహసం ఐసీసీ చేయకపోవచ్చు. ఇక్కడ ఈ టోర్నీ ఆడటానికి విదేశీ జట్లు కూడా అంగీకరించడం అనుమానమే. కాబట్టి గత ఏడాది ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించిన యూఏఈలో టీ20 ప్రపంచకప్‌ను జరిపిద్దామని ఐసీసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీన్ని భారత్ కూడా వ్యతిరేకించకపోవచ్చనే భావిస్తున్నారు.

Satya

Recent Posts

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి!

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…

44 minutes ago

వైసీపీ కాపుల సభలో ఏం జరిగింది?

వైసీపీ ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ‌లో ఆదివారం నిర్వ‌హించిన కాపుల స‌భ‌లో మాజీ మంత్రి, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బొత్స…

3 hours ago

ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వాదం దొరికిందా

బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…

8 hours ago

అమెరికా వెళ్లే వారికి అలెర్ట్‌… నాలుగేళ్లే గ‌డువు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దేశంలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేష‌న్…

8 hours ago

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…

10 hours ago

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

11 hours ago