బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ.. కీలకమైన బూత్ లెవిల్ కార్యకర్తలు జనసేనకు కొరవడ్డారు. ఆది నుంచి కూడా క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల ఏర్పాటు, కార్యకర్తల నియామకంపై పార్టీ ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. దీంతో క్షేత్రస్థాయిలో డెవలప్ అయ్యేందుకు పార్టీకి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
దీనికితోడు త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బూత్ స్థాయి కార్యకర్తల అవసరం పార్టీకి ఏర్పడింది. గత ఏడాది కాలంగా ఈ విషయంపై పార్టీలోనూ చర్చ సాగుతోంది. బూత్ లెవిల్ కమిటీలను ఏర్పాటు చేయాలని, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించాలని పలువురు సీనియర్లు కోరుతున్నారు. అయితే.. ఎప్పటికప్పుడు ఈ విషయంపై అడుగులు ముందుకు పడడం లేదు.
మరోవైపు వచ్చే రెండు మాసాల్లో స్థానిక ఎన్నికలతోపాటు పంచాయతీ పోరు కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో నాయకుల కంటే కూడా బూత్ స్థాయి కార్యకర్తలకు పని ఎక్కువగా ఉంటుంది. ఓటు బ్యాంకును పెంచాలన్నా.. జెండా పట్టుకుని ఇంటింటికీ తిరగాలన్నా.. కూడా బూత్ లెవిల్ కార్యకర్తలు కీలకం. అందుకే తాజాగా ఈ వ్యవహారంపై జనసేన దృష్టిసారించిందని.. త్వరలోనే కమిటీలను ఏర్పాటు చేయనున్నామని సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.
ఇతర పార్టీలను చూసుకుంటే.. టీడీపీ భారీ సంఖ్యలో బూత్ స్థాయికార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీగా నిలిచింది. దీని తర్వాత స్థానంలో వైసీపీ ఉండగా.. బీజేపీ కూడా ఇదేస్థాయిలో బూత్ కమిటీలను డెవలప్ చేసుకుంది. ఇక, పెద్దగా ఓటు బ్యాంకు లేని కమ్యూనిస్టులకు కూడా బూత్ స్థాయిలో కార్యకర్తలు ఉండడం గమనార్హం. అలానే.. కాంగ్రెస్ పార్టీలోనూ బూత్ లెవిల్ కార్యకర్తలు ఆశించిన స్థాయిలో ఉన్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ కూడా.. ఇప్పుడు బూత్ లెవిల్ కార్యకర్తల పై దృష్టిసారించింది.
This post was last modified on July 10, 2026 7:55 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…