ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం కోసం వేలాది మంది రైతులు భూములు ఇచ్చారు. తద్వారా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే.. రాజధాని తొలి విడత భూ సమీకరణలో కొందరు రైతులు భూములు ఇవ్వలేదు. తాము భూములు ఇచ్చేది లేదని భీష్మించారు.
అయితే.. రైతులు ఇవ్వని భూముల కారణంగా.. రహదారులు వంకర టింకరగా నిర్మించాల్సి వస్తోంది. రైతులు ఇవ్వని భూములను వదిలేసి… ఇచ్చిన వాటిలోనే నిర్మాణాలు చేపడుతున్నారు. దీనివల్ల రాజ ధాని స్వరూపమే దెబ్బతింటోంది. ఇటీవల ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రాజదానిలో పర్యటించినప్పుడు ఈ విషయం చర్చకు వచ్చింది. దీంతో ఆ వెంటనే ప్రభుత్వ 2013నాటి కేంద్ర చట్టం మేరకు భూ సేకరణకు ఆదేశించింది.
రాజధానిలో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలకు మధ్యలో ఉన్న సుమారు 700 ఎకరాల మేరకు పూలింగ్ లో ఇవ్వాలని.. రైతులకు పదే పదే అధికారులు విన్నవించారు. నోటీసులు ఇచ్చారు. అయినా రైతులు పట్టించుకోలేదు. దీనికి వైసీపీ మద్దతు కూడా ఉండడంతో వారు న్యాయపోరాటానికి దిగారు. హైకోర్టులో వేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు వారికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అభివృద్ధి కార్యక్రమాలు జరిగేప్పుడు రైతుల నుంచి భూములు తీసుకుంటే తప్పులేదని.. అయితే పరిహారం ఇచ్చి భూములు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో తాజాగా శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో భూ సేకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో శనివారం ఉదయమే కీలకమైన `సీడ్ యాక్సిస్ రోడ్డు` పరిధిలో భూములు ఇవ్వని రైతుల నుంచి ఆయా భూములను సీఆర్ డీఏ అధికారులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులను భారీగా మోహరించారు. అయితే.. తమకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా పొలాల్లో పంటను ధ్వంసం చేస్తున్నారని, భూములు ఆక్రమించుకుంటున్నారు రైతులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అడ్డుకున్న రైతులను పోలీసులు అరెస్టు చేయగా.. మరికొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
This post was last modified on July 11, 2026 8:27 pm
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…
సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…
తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…
విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…