పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి. లెనిన్ తో అఖిల్ సాలిడ్ హిట్ కొట్టేసినట్టే. టాక్స్ సంగతి ఎలా ఉన్నా కంటెంట్ పరంగా మాస్ జనాన్ని మెప్పించడంలో దర్శకుడు మురళికిషోర్ అబ్బూరు సక్సెసయ్యారు. ముఖ్యంగా అఖిల్ కెరీర్ లో ఇప్పటిదాకా ట్రై చేయని జానర్ కావడం, తనకో విజయం దక్కాలని ఫ్యాన్ డంతో సంబంధం లేకుండా అందరూ కోరుకోవడం బహుశా ఇలాంటి ఫలితాన్ని ఇచ్చిందేమో.
గత ఇరవై నాలుగు గంటల బుక్ మై షోలో లెనిన్ టికెట్లు 2 లక్షల 60 వేలకు పైగా అమ్ముడుపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ లో సెకండ్ షో చూద్దామంటే టికెట్ దొరికే పరిస్థితి లేదు. బిసి కేంద్రాల్లో కౌంటర్ సేల్స్ చాలా బాగున్నాయని, టైటిల్ కార్డు పడే టైంకి హౌస్ ఫుల్ బోర్డు పెడుతున్నామని ఎగ్జిబిటర్లు అంటున్నారు. సండే పడే షోలన్నీ అఖిల్ డామినేషన్ లోనే ఉండబోతున్నాయి. అర సెంచరీ లాంఛనం ఇవాళ జరిగిపోతుంది.
కలెక్షన్ నెంబర్ల సంగతి పక్కనపెడితే లెనిన్ లాంటి జెన్యూన్ హిట్ కోసం మొహం వాచిపోయిన అక్కినేని అభిమానులకు ఇదో సంబరంగా మారిపోయింది. రికార్డులు ఎన్ని బద్దలవుతాయనేది పక్కనపెడితే ఇంత రెస్పాన్స్ వాళ్ళు ఊహించనిది. షూటింగ్ లో జాప్యం, హీరోయిన్ మారడం, విడుదల వాయిదాలు పడటం లాంటి ఎన్నో కారణాలు నమ్మకంతో పాటు అనుమానాలు కూడా పెంచుతూ వచ్చాయి. ఎట్టకేలకు అవన్నీ సెట్ అయినట్టే.
ఇదే దూకుడు ఇంకో వారం దాకా ఉంటుందానేది వేచి చూడాలి. ఎందుకంటే పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలకు మొదటి వీకెండ్ ఊపు మీద ఉండటం సహజం. ఇదే జోరు కనక సోమవారం నుంచి కొనసాగిస్తే బ్లాక్ బస్టర్ ముద్ర పడిపోతుంది. బ్రేక్ ఈవెన్ పరంగా ఎలాంటి టెన్షన్లు పెట్టుకోనక్కర్లేదని కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజు ఆల్రెడీ గంటకు 5 వేల టికెట్ల చొప్పున లెనిన్ బ్యాటింగ్ మొదలైపోయింది. రోజు అయిపోయే టైంకి ఎన్ని బౌండరీలు కొడతాడో చూడాలి.
This post was last modified on July 12, 2026 10:05 am
ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…
దేశ రాజధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు పోలీసుల పహారాలో ఉండనుంది. దాదాపు నగరం…