పశ్చిమబెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ పై చర్చ పెరిగిపోతోంది. అదేమిటంటే ఫిరాయింపుల భవిష్యత్తుపై. నిజానికి ఉన్నదన్నుట్లుగా మమతాబెనర్జీనీ ఎదుర్కొనే సత్తా బీజేపీ అగ్రనేతలకు లేదనే చెప్పాలి. మమతను ఎదుర్కొనే శక్తి లేదు కాబట్టే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి ఫిరాయింపులను బీజేపీ అగ్రనేతలు ప్రోత్సహించారు.
24 గంటలూ రాజకీయాల్లో విలువలు, నిజాయితి గురించి గొంతెత్తి మాట్లాడే ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆమోదంతోనే ఫిరాయింపులు జరిగిన విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే కోల్ కత్తాలో జరిగిన ఓ బహిరంగ సభలో తృణమూల్ పార్టీలో నుండి చాలామంది ఎంఎల్ఏలు, ఎంపిలు, నేతలు బీజేపీలోకి వచ్చేయబోతున్నట్లు స్వయంగా మోడినే ప్రకటించారు. అప్పట్లో మోడి ప్రకటన దేశరాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి.
ఆ తర్వాత నుండి ఓ పద్దతి ప్రకారం అమిత్ షా ప్రలోభాల పర్వాన్ని దగ్గరుండి రక్తి కట్టించారు. మొత్తం మీద మమతను దెబ్బ కొట్టే టార్గెట్ తోనే 29 మంది ఎంఎల్ఏలు, ఇద్దరు ఎంపిలతో పాటు అనేక మంది నేతలను బీజేపీలోకి లాగేసుకున్నారు. తృణమూల్ నుండి బీజేపీలోకి ఫిరాయించిన వారిలో అత్యధికుల మీద భారీ ఎత్తున అవినీతి ఆరోపణలున్నాయి. అయినా వాళ్ళని బీజేపీ చేర్చేసుకున్నది.
మరిపుడు వాళ్ళల్లో ఎంతమందికి బీజేపీ టికెట్లిస్తుందో చూడాలి. అలాగే టికెట్లు తీసుకున్న వాళ్ళల్లో ఎంతమంది గెలుస్తారన్న పాయింట్ మీదే చర్చ పెరిగిపోతోంది. టికెట్లు ఏపిలో కూడా చంద్రబాబునాయుడు ఇలాగే ప్రలోభాలకు గురిచేసి 2014లో గెలిచిన 23 మంది వైసీపీ ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను టీడీపీలోకి లాక్కున్నారు. అయితే వాళ్ళల్లో 17 మంది ఎంఎల్ఏలకు మాత్రమే టికెట్లిచ్చారు. వాళ్ళలో కూడా గెలిచింది కేవలం ఒక్కళ్ళే. మరి ఇదే పద్దతిలో బెంగాల్లో కూడా జరగటంతో ఇదే పాయింట్ మీద చర్చలు జోరందుకున్నాయి. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.
This post was last modified on March 14, 2021 3:39 pm
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…