పశ్చిమబెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ పై చర్చ పెరిగిపోతోంది. అదేమిటంటే ఫిరాయింపుల భవిష్యత్తుపై. నిజానికి ఉన్నదన్నుట్లుగా మమతాబెనర్జీనీ ఎదుర్కొనే సత్తా బీజేపీ అగ్రనేతలకు లేదనే చెప్పాలి. మమతను ఎదుర్కొనే శక్తి లేదు కాబట్టే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి ఫిరాయింపులను బీజేపీ అగ్రనేతలు ప్రోత్సహించారు.
24 గంటలూ రాజకీయాల్లో విలువలు, నిజాయితి గురించి గొంతెత్తి మాట్లాడే ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆమోదంతోనే ఫిరాయింపులు జరిగిన విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే కోల్ కత్తాలో జరిగిన ఓ బహిరంగ సభలో తృణమూల్ పార్టీలో నుండి చాలామంది ఎంఎల్ఏలు, ఎంపిలు, నేతలు బీజేపీలోకి వచ్చేయబోతున్నట్లు స్వయంగా మోడినే ప్రకటించారు. అప్పట్లో మోడి ప్రకటన దేశరాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి.
ఆ తర్వాత నుండి ఓ పద్దతి ప్రకారం అమిత్ షా ప్రలోభాల పర్వాన్ని దగ్గరుండి రక్తి కట్టించారు. మొత్తం మీద మమతను దెబ్బ కొట్టే టార్గెట్ తోనే 29 మంది ఎంఎల్ఏలు, ఇద్దరు ఎంపిలతో పాటు అనేక మంది నేతలను బీజేపీలోకి లాగేసుకున్నారు. తృణమూల్ నుండి బీజేపీలోకి ఫిరాయించిన వారిలో అత్యధికుల మీద భారీ ఎత్తున అవినీతి ఆరోపణలున్నాయి. అయినా వాళ్ళని బీజేపీ చేర్చేసుకున్నది.
మరిపుడు వాళ్ళల్లో ఎంతమందికి బీజేపీ టికెట్లిస్తుందో చూడాలి. అలాగే టికెట్లు తీసుకున్న వాళ్ళల్లో ఎంతమంది గెలుస్తారన్న పాయింట్ మీదే చర్చ పెరిగిపోతోంది. టికెట్లు ఏపిలో కూడా చంద్రబాబునాయుడు ఇలాగే ప్రలోభాలకు గురిచేసి 2014లో గెలిచిన 23 మంది వైసీపీ ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను టీడీపీలోకి లాక్కున్నారు. అయితే వాళ్ళల్లో 17 మంది ఎంఎల్ఏలకు మాత్రమే టికెట్లిచ్చారు. వాళ్ళలో కూడా గెలిచింది కేవలం ఒక్కళ్ళే. మరి ఇదే పద్దతిలో బెంగాల్లో కూడా జరగటంతో ఇదే పాయింట్ మీద చర్చలు జోరందుకున్నాయి. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.
This post was last modified on March 14, 2021 3:39 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…