ఈ గురువారం మహాశివరాత్రి కానుకగా వచ్చిన మూడు చిత్రాల్లో ‘గాలి సంపత్’ ఒకటి. మిగతా రెండు చిత్రాలు ‘జాతి రత్నాలు’; ‘శ్రీకారం’లతో పోలిస్తే దీనికి టాక్ యావరేజ్గా వచ్చింది. వసూళ్లు కూడా ఓ మోస్తరుగా ఉన్నాయి. వీకెండ్ అయ్యాక ఈ సినిమా ఫలితమేంటో తెలుస్తుంది. ఐతే ఈ చిత్ర నిర్మాతలు విడుదలకు ముందే సేఫ్ జోన్లోకి వచ్చేయడం విశేషం. తక్కువ రోజుల్లో, పరిమిత బడ్జెట్లో ఈ సినిమాను పూర్తి చేసేయడం నిర్మాతలకు కలిసొచ్చింది.
అనిల్ రావిపూడి బ్రాండ్ ఈ చిత్రానికి బాగానే కలిసొచ్చి బిజినెస్ అంచనాలకు మించి జరిగింది. పెట్టుబడి మీద మంచి లాభానికే సినిమాను అమ్ముకున్నారు. కొన్ని నెలల కిందట సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడంతోనే ఈ చిత్ర ప్రమోషన్లు కూడా మొదలైపోయాయి. మొదట్నుంచి సినిమాను వార్తల్లో నిలబెడుతూ వచ్చారు. ఫీఫీఫీ పాట సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. టీజర్, ట్రైలర్ సైతం ఆకట్టుకున్నాయి. దీంతో విడుదల ముంగిట ఈ సినిమాకు మంచి బజ్ వచ్చింది.
దిల్ రాజు సపోర్ట్ కూడా ఉండటంతో వేరే రెండు చిత్రాల పోటీ మధ్య ఈ సినిమాకు మంచి రిలీజే దక్కింది. ఓపెనింగ్స్ ఓ మోస్తరుగా వచ్చాయి. లాంగ్ వీకెండ్ను ఉపయోగించుకుని ఈ వసూళ్లతోనే సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులేస్తోంది. సినిమాలో మంచి కథ ఉన్నప్పటికీ.. కథనం ఇంకొంచెం మెరుగ్గా ఉండాల్సిందన్న అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమైంది.
ఐతే రాజేంద్ర ప్రసాద్ పాత్ర, పెర్ఫామెన్స్ ప్రేక్షకులను మెప్పిస్తుండటం సినిమాకు కలిసొచ్చే అంశం. బాక్సాఫీస్ దగ్గర విపరీతమైన పోటీ ఉండటం సినిమాకు కొంచెం నెగెటివ్ అవుతోంది. కానీ సినిమాకు డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా కూడా మంచి ఆదాయమే లభించే అవకాశముంది. ఓవరాల్గా చూస్తే నిర్మాతల పెట్టుబడికి మంచి లాభమే అందించినట్లే ఉంది ‘గాలి సంపత్’.
This post was last modified on March 14, 2021 5:48 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…