Political News

డియర్ ఇండియన్స్.. సెంచరీకి రెడీగా ఉండండి

‘‘పెట్రోల్ 100 అయిన వెంటనే బండి రోడ్ మధ్యలో ఆపండి. హెల్మెట్ తీయండి. ఆకాశం వైపు చూడండి. హెల్మెట్‌ను ముద్దాడండి. క్రికెటర్లను ఇలాగే సెంచరీని సెలబ్రేట్ చేసుకుంటారు మరి’’.. కొన్ని రోజులుగా వాట్సాప్‌లో, ఇతర సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్న జోక్ ఇది. ఇండియాలో రోజు రోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు.. సెంచరీ వైపు పరుగులు పెడుతున్న నేపథ్యంలో ఈ జోక్ పుట్టింది.

ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పెట్రోల్ ధర రూ.90 మార్కును దాటేసింది. కొన్ని చోట్ల 94-95 మధ్య కూడా ఉంది లీటర్ ధర. ఇప్పుడు బడ్జెట్లో వడ్డింపులు చూస్తే లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కును టచ్ చేయడానికి ఎన్నో రోజులు పట్టదు అనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తరచుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండగా.. తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తమ వంతుగా పన్నుల బాదుడుకు కూడా సిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇచ్చారు.

అగ్రి సెస్ పేరుతో పెట్రోల్ మీద రెండున్నర రూపాయలు, డీజిల్ మీద 4 రూపాయలు వడ్డించనున్నట్లు వెల్లడించారు. ఇక రాష్ట్రాలు తమ వంతుగా ఏవో పన్నులు జోడించాయంటే ఇంకొన్ని రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ మార్కును అందుకోవడం ఖాయం. ఏదో జోక్ లాగా సెంచరీ గురించి చెప్పుకున్నాం కానీ.. అది నిజమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవన్నమాట.

ఓవైపు పొరుగున ఉన్న, మనకంటే చిన్న, పేద దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల్లో ఇండియాతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు చాలా తక్కువగా ఉండగా.. మన దేశంలో మాత్రం పన్నుల పేరుతో తరచుగా ధరలు పెంచి ఈ స్థాయికి తీసుకురావడం దారుణమన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఇంధన ధరల పెంపు విషయంలో గత ప్రభుత్వాలను తప్పుబట్టి, అధికారంలోకి వచ్చాక ముందున్న వాళ్లకంటే అధికంగా వడ్డింపులతో ప్రజల నడ్డి విరుస్తుండటం శోచనీయం.

This post was last modified on February 1, 2021 4:36 pm

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

39 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

54 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

55 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago