Political News

డియర్ ఇండియన్స్.. సెంచరీకి రెడీగా ఉండండి

‘‘పెట్రోల్ 100 అయిన వెంటనే బండి రోడ్ మధ్యలో ఆపండి. హెల్మెట్ తీయండి. ఆకాశం వైపు చూడండి. హెల్మెట్‌ను ముద్దాడండి. క్రికెటర్లను ఇలాగే సెంచరీని సెలబ్రేట్ చేసుకుంటారు మరి’’.. కొన్ని రోజులుగా వాట్సాప్‌లో, ఇతర సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్న జోక్ ఇది. ఇండియాలో రోజు రోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు.. సెంచరీ వైపు పరుగులు పెడుతున్న నేపథ్యంలో ఈ జోక్ పుట్టింది.

ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పెట్రోల్ ధర రూ.90 మార్కును దాటేసింది. కొన్ని చోట్ల 94-95 మధ్య కూడా ఉంది లీటర్ ధర. ఇప్పుడు బడ్జెట్లో వడ్డింపులు చూస్తే లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కును టచ్ చేయడానికి ఎన్నో రోజులు పట్టదు అనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తరచుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండగా.. తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తమ వంతుగా పన్నుల బాదుడుకు కూడా సిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇచ్చారు.

అగ్రి సెస్ పేరుతో పెట్రోల్ మీద రెండున్నర రూపాయలు, డీజిల్ మీద 4 రూపాయలు వడ్డించనున్నట్లు వెల్లడించారు. ఇక రాష్ట్రాలు తమ వంతుగా ఏవో పన్నులు జోడించాయంటే ఇంకొన్ని రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ మార్కును అందుకోవడం ఖాయం. ఏదో జోక్ లాగా సెంచరీ గురించి చెప్పుకున్నాం కానీ.. అది నిజమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవన్నమాట.

ఓవైపు పొరుగున ఉన్న, మనకంటే చిన్న, పేద దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల్లో ఇండియాతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు చాలా తక్కువగా ఉండగా.. మన దేశంలో మాత్రం పన్నుల పేరుతో తరచుగా ధరలు పెంచి ఈ స్థాయికి తీసుకురావడం దారుణమన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఇంధన ధరల పెంపు విషయంలో గత ప్రభుత్వాలను తప్పుబట్టి, అధికారంలోకి వచ్చాక ముందున్న వాళ్లకంటే అధికంగా వడ్డింపులతో ప్రజల నడ్డి విరుస్తుండటం శోచనీయం.

This post was last modified on February 1, 2021 4:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

1 hour ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

2 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

3 hours ago

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్…

3 hours ago

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

4 hours ago

మళ్ళీ పాద‌యాత్ర చేసి సాధించేది ఏమన్నా ఉందా జగన్?

అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న ప‌రిస్థితిలో చెప్పడం కష్టంగా…

5 hours ago