పెళ్ళిచూపులు’ సినిమాతో టాలీవుడ్లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. తెలుగు వారినే కాక ఇతర భాషల వాళ్లనూ ఆకట్టుకున్న ఆ సినిమా ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. మరెన్నో కొత్త కథలకు దారి చూపించింది. దీని తర్వాత తరుణ్ ఎలాంటి సినిమాలు తీస్తాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కానీ ‘పెళ్ళిచూపులు’ విడులయ్యాక నాలుగున్నరేళ్లలో తరుణ్ నుంచి ఒకే సినిమా వచ్చింది. ‘ఈ నగరానికి ఏమైంది’ పేరుతో తెరకెక్కిన ఆ సినిమా కూడా అనుకున్నంతగా ఆడలేదు.
‘పెళ్ళిచూపులు’ చిత్రాన్ని విడుదల చేసిన సురేష్ ప్రొడక్షన్స్లోనే తరుణ్ ఓ పెద్ద సినిమా చేస్తాడని, అందులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తాడని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ‘పెళ్ళిచూపులు’ తర్వాత తరుణ్ తీయాల్సిన సినిమా కూడా అదే. కానీ ఆ సినిమాపై ఎంతకీ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఇలాగే నాలుగేళ్లకు పైగా గడిచిపోయాయి.
ఐతే ఎట్టకేలకు తరుణ్-వెంకీ కలయికలో సినిమాకు అన్ని అడ్డంకులూ తొలగిపోయి అతి త్వరలోనే అది పట్టాలెక్కబోతోందని సమాచారం. గుర్రపు పందేల నేపథ్యంలో సాగే ఈ సినిమాకు నిర్మాత సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. స్క్రిప్టు ఓకే అయిందని, ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. మే లేదా జూన్లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం.
ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్లో ‘నారప్ప’ సినిమాను పూర్తి చేశాడు వెంకీ. ఈ సినిమా మే 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అది పూర్తి కాగానే ‘ఎఫ్-3’ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు ఈ సీనియర్ హీరో. అది మే-జూన్ మధ్య పూర్తవుతుందని అంటున్నారు. ఆ చిత్రం ఆగస్టు 27న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ‘ఎఫ్-3’ అవ్వగానే తరుణ్ సినిమా మీదికి వెళ్లిపోతాడు వెంకీ. ఈ ఏడాదే ఈ సినిమా కూడా పూర్తయ్యే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల ఉండొచ్చేమో.
This post was last modified on February 1, 2021 4:40 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…