పెళ్ళిచూపులు’ సినిమాతో టాలీవుడ్లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. తెలుగు వారినే కాక ఇతర భాషల వాళ్లనూ ఆకట్టుకున్న ఆ సినిమా ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. మరెన్నో కొత్త కథలకు దారి చూపించింది. దీని తర్వాత తరుణ్ ఎలాంటి సినిమాలు తీస్తాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కానీ ‘పెళ్ళిచూపులు’ విడులయ్యాక నాలుగున్నరేళ్లలో తరుణ్ నుంచి ఒకే సినిమా వచ్చింది. ‘ఈ నగరానికి ఏమైంది’ పేరుతో తెరకెక్కిన ఆ సినిమా కూడా అనుకున్నంతగా ఆడలేదు.
‘పెళ్ళిచూపులు’ చిత్రాన్ని విడుదల చేసిన సురేష్ ప్రొడక్షన్స్లోనే తరుణ్ ఓ పెద్ద సినిమా చేస్తాడని, అందులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తాడని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ‘పెళ్ళిచూపులు’ తర్వాత తరుణ్ తీయాల్సిన సినిమా కూడా అదే. కానీ ఆ సినిమాపై ఎంతకీ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఇలాగే నాలుగేళ్లకు పైగా గడిచిపోయాయి.
ఐతే ఎట్టకేలకు తరుణ్-వెంకీ కలయికలో సినిమాకు అన్ని అడ్డంకులూ తొలగిపోయి అతి త్వరలోనే అది పట్టాలెక్కబోతోందని సమాచారం. గుర్రపు పందేల నేపథ్యంలో సాగే ఈ సినిమాకు నిర్మాత సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. స్క్రిప్టు ఓకే అయిందని, ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. మే లేదా జూన్లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం.
ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్లో ‘నారప్ప’ సినిమాను పూర్తి చేశాడు వెంకీ. ఈ సినిమా మే 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అది పూర్తి కాగానే ‘ఎఫ్-3’ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు ఈ సీనియర్ హీరో. అది మే-జూన్ మధ్య పూర్తవుతుందని అంటున్నారు. ఆ చిత్రం ఆగస్టు 27న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ‘ఎఫ్-3’ అవ్వగానే తరుణ్ సినిమా మీదికి వెళ్లిపోతాడు వెంకీ. ఈ ఏడాదే ఈ సినిమా కూడా పూర్తయ్యే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల ఉండొచ్చేమో.
This post was last modified on February 1, 2021 4:40 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…