Political News

వైసీపీ హయాంలో గ్రూప్ -1లో అక్రమాలు నిజమే

డీఎస్సీలో అక్రమాలు జరిగినట్లు నిరాధార ఆరోపణలు గగ్గోలు పెడుతున్న వైసీపీ అసలు గుట్టు బయట పడింది. గత ప్రభుత్వం పాలనలో నిర్వహించిన గ్రూప్ -1 లో పలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ ఆరోపణల నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం వేసిన సిట్ తుది నివేదికను హై కోర్టుకు సమర్పించింది. గ్రూప్ -1 మూల్యాంకనంలో నాటి జగన్ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించినట్లు సిట్ నిర్ధారించింది. ఏపీపీ ఎస్సీ నిబంధనలకు విరుద్ధంగా మూడు సార్లు మూల్యాంకనం చేయించినట్లు సిట్ నివేదిక ఇచ్చింది.

సిట్ నివేదిక ప్రకారం… ఒకే జవాబు పత్రాలను మూడు సార్లు మూల్యాంకనం చేశారు. మూడో మూల్యాంకనం కోసం కొత్త ఓఎమ్మార్ బార్ కోడ్ షీట్లను 7 ముద్రించారు. ఎంపికైన 165మందిలో 160 మందికి సంబందించిన జవాబు పత్రాల్లో మార్కులలో మార్పులు చోటు చేసుకున్నాయి.

ఎంపిక కాని 161 మందిలో 153 మంది పత్రాల్లోనూ, రిట్ పిటీషనర్లకు సంబందించి 405 మంది జవాబు పత్రాల్లో మార్పులు జరిగాయి. 61 మంది స్లిప్పుల్లో వైట్ కరెక్షన్ ఫ్లూయిడ్ ఉపయోగించినట్లు తేలింది . స్వయంగా చీఫ్ ఎగ్జామినర్లు మార్కులను సవరించినట్లు ఫారెన్సిక్ నివేదికలో బయట పడింది. జవాబు పత్రాలను హై ల్యాండ్ రిసార్ట్ లో 84 రోజులపాటు దాచి ఉంచడం అధికారులను విస్మయానికి గురిచేసింది.

ఎక్కడైనా పరీక్షా పత్రాలను నిపుణుల చేత మూల్యాంకనం చేయించడం జరుగుతుంది. వైసీపీ పాలకులు మాత్రం డేటా ఎంట్రీ ఆపరేటర్ల చేత మూల్యాంకనం చేయించారు. 452 మంది నిపుణుల ప్యానల్ ను పక్కన పెట్టి 66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో మూల్యాంకనం చేయించినట్లు సిట్ నివేదికలో పేర్కొంది.

గ్రూప్ -1వంటి ప్రతిష్టాత్మక పరీక్షా పత్రాలను ఒక రిసార్ట్ లో ఎలా ఉంచుతారన్న ప్రశ్నకు సమాధానం లేదు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల చేత గ్రూప్ -1 జవాబు పత్రాలను ఎలా మూల్యాంకనం చేయించడం ఎంత బరితెగింపో అర్ధం చేసుకోవచ్చు. ఈ నివేదిక మీద కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాలి.

This post was last modified on August 12, 2026 5:36 pm

Share

Recent Posts

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

2 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

2 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

2 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

4 hours ago

జగన్ కేసుల లోగుట్టు సాయిరెడ్డి విప్పనున్నారా?

వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…

5 hours ago

ఆర్ఆర్ఆర్ కూడా ఇరుముడి వెనకే

ఇరుముడి సినిమాలో లీడ్ రోల్ చేసింది టాలీవుడ్ మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడైన రవితేజ. ఆయన నుంచి వచ్చిన చివరి…

6 hours ago