Political News

మోడీ చంద్రబాబుతో ప్రకటన చేయిస్తారా

అటు పార్లమెంటులోనూ.. ఇటు బయట కూడా.. నీట్ ప్రశ్నపత్రాలకు సంబంధించిన నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం ఆసక్తిగా మారింది. ప్రధానంగా ఆగస్టు 1న విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాలంటూ ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్రధానికి ఇచ్చారు.

పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో మోడీని కలిసిన చంద్రబాబు.. ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందించారు. దీంతోపాటు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను, మొమెంటోను అందించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు, ప్రతిపక్షం కాంగ్రెస్ చేస్తున్న ధర్నాలు వంటి విషయాలపైనా ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు చర్చించినట్టు ఏపీ భవన్ వర్గాలు తెలిపాయి. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

చంద్రబాబుతో ప్రకటన?

ప్రస్తుతం జరుగుతున్న నిరసనలు, ఆందోళనలను విరమింప చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా ప్రధాని మోడీ చంద్రబాబుతో ఈ విషయాన్ని చర్చించి.. ఆయన ద్వారా ప్రకటన చేయించాలని చూస్తున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలోనూ పలు సందర్భాల్లో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఆయన సేవలు వినియోగించుకునే దిశగా మోడీ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

This post was last modified on July 22, 2026 4:19 pm

Share

Recent Posts

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

2 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

5 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

5 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

5 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

8 hours ago

జగన్ కేసుల లోగుట్టు సాయిరెడ్డి విప్పనున్నారా?

వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…

9 hours ago