అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి.. బుధ‌వారం మ‌ధ్యాహ్నం.. హైద‌రాబాద్‌లోని నివాసానికి చేరుకున్నారు. గ‌త నాలుగు రోజుల కిందట ఆయ‌న కుడి భుజానికి ఆప‌రేష‌న్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. కొద్ది రోజులు ఆసుప‌త్రిలోనే ఉండి వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మందులు వాడిన ఆయ‌న‌.. కొద్దిగా కోలుకోవ‌డంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు.

అభిమానుల కోలాహ‌లం..

ప‌వ‌న్ క‌ల్యాణ్ డిశ్చార్జ్ అవుతున్నార‌న్న‌వార్త బ‌య‌ట‌కు రాగానే.. అభిమానులు పెద్ద సంఖ్య‌లో కోకిలా బెన్ ఆసుప‌త్రిని చుట్టుముట్టారు. ప‌వ‌న్ ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటూ.. స్థానిక బ‌డా గ‌ణేష్ ఆల‌యంలో పూజ‌లు చేయించారు. అనంత‌రం.. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాన్వాయ్‌కు.. విమానాశ్ర‌యం వ‌ర‌కు వీడ్కోలు ప‌లికారు. త‌మ అభిమాన నాయ‌కుడు ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకున్నారు. జై ప‌వ‌న్ నినాదాల‌తో కోకిలా బెన్ ఆసుప‌త్రి ప్రాంగ‌ణం ద‌ద్ద‌రిల్లింది.

ఆసుప‌త్రి వైద్యుల‌కు..

త‌న‌ను కంటికి రెప్ప‌లా చూసుకున్న ఆసుప‌త్రి వైద్యులు, సిబ్బందికి ప‌వ‌న్ క‌ల్యాణ్ దంప‌తులు కృత‌జ్ఞత‌లు తెలిపారు. ముఖ్యంగా ఆప‌రేష‌న్ వైద్య బృందానికి నేతృత్వం వ‌హించిన డాక్ట‌ర్‌కు చేతులు జోడించి న‌మ‌స్క‌రించి.. జ్ఞాపిక‌ను అందించారు. గ‌త నాలుగు రోజులుగా త‌న‌కు ఆసుప‌త్రిలో సేవ‌లు చేసిన‌ సిబ్బందికి ప్ర‌త్యేకంగా కానుక‌లు ఇచ్చారు. ప్ర‌తి ఒక్క‌రికీ ముంబాయి మిఠాయి ప్యాకెట్ల‌ను పంపిణీ చేశారు. న‌గ‌దు కూడా అందించారు.

చంద్ర‌బాబు ఫోన్‌!

ముంబై ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ కానున్న కొద్ది సేప‌టికి ముందు సీఎం చంద్ర‌బాబు ప‌వ‌న్‌కు ఫోన్ చేశా రు. ప్ర‌స్తుత ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకున్నారు. అంతా బాగుంటేనే డిశ్చార్జ్ కావాలని లేక‌పోతే.. ఆసుప‌త్రి లోనే రెస్ట్ తీసుకోవాల‌ని ఆయ‌న‌కు సూచించారు. ఈ స‌మ‌యంలో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ లు.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున వ్య‌వ‌హ‌రించాల్సిన తీరుపై కూడా ఇరువురు చ‌ర్చించారు.