Political News

అమరావతిలో అలజడి.. వైసీపీ అగ్గి రాజేస్తోందా?

రాజధాని అమరావతి ప్రాంతంలో చాలా కాలం తర్వాత మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతో వైసీపీ నేతలు చేపట్టిన పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ గందరగోళంలో ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గతంలో మూడు రాజధానుల పేరుతో అమరావతి ప్రాంతంలో ఉద్యమాన్ని నడిపించిన వైసీపీ, ఇప్పుడు సీఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతో మరోసారి రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తతలు సృష్టిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

రాజధాని భూముల పరిశీలనకు వైసీపీ నేతలు పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డితో పాటు సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులమంటూ కొందరు మంగళవారం ఉదయం బయలుదేరారు. ఉండవల్లి సెంటర్ వద్ద రాజధాని రైతులు, టీడీపీ మద్దతుదారులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ‘వైసీపీ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తూ కోడిగుడ్లు, రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో లేళ్ల అప్పిరెడ్డి కారు ధ్వంసమైంది. రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు గాయాలు కాగా, ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

రాజధానిగా అమరావతిని పూర్తిగా అంగీకరించిన తర్వాతే ఇలాంటి పర్యటనలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉండవల్లి సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. మరోవైపు, పెనుమాక రైతుల ఆహ్వానం మేరకే భూముల పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చామని వైసీపీ నేతలు తెలిపారు. భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం వేధిస్తోందని, వ్యవసాయం చేయకుండా భూముల చుట్టూ మట్టి తవ్వేసిందని ఆరోపిస్తూ వాటిని పరిశీలించేందుకు వచ్చిన తమపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని వైసీపీ వర్గాలు ఆరోపించాయి.

ఈ ఘటనతో అమరావతి ప్రాంతంలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ఒకవైపు వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నామని చెబుతుండగా, మరోవైపు టీడీపీ నేతలు మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలు సృష్టించి రాజధాని ప్రాంతంలో అలజడి రేపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. దీంతో ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

Kumar

Recent Posts

భాగ్యరాజ్.. గుంటూరు అల్లుడేనండి..!

తమిళ సినీ పరిశ్రమలో "స్క్రీన్‌ప్లే కింగ్"గా పేరొందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ మృతితో సినీ ప్రపంచం విషాదంలో…

19 minutes ago

నానాజీ వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారు?

వైసీపీ నేత‌ల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదేస‌మ‌యంలో కొన్ని కీలక వ్యాఖ్య‌లు కూడా…

23 minutes ago

మళ్లీ తమిళ దర్శకుడితో తెలుగు హీరో?

తెలుగులో కేవలం నటనకు పరిమితం కాకుండా.. రైటింగ్, మేకింగ్‌లోనూ భాగం అవుతూ తన సినిమాలను సక్సెస్ చేసుకునే హీరోల్లో నవీన్…

1 hour ago

వైసీపీ నేతలను తగ్గొద్దంటున్న పవన్

వైసీపీ నేతల విమర్శల్లో ఉపయోగించిన భాషపై జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. మీకు అధికారం…

1 hour ago

66 ఏళ్ల వయసులో ఇదేమీ ఎనర్జీ సామి

వయసు ఒక అంకె మాత్రమే అని రుజువు చేసే హీరోలు కొందరుంటారు. ఫిట్‌నెస్ కాపాడుకుంటూ.. సూపర్ లుక్ మెయింటైన్ చేస్తూ..…

2 hours ago

దిల్ రాజు కోరుకున్న మార్పులు జరగాలి

టాలీవుడ్ సీనియర్ మోస్ట్ అనుభవజ్ఞులు ఎవరంటే టాప్ ఫైవ్ లో ఖచ్చితంగా ఉండే పేరు దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్, నిర్మాతగా…

2 hours ago