వైసీపీ నేతల విమర్శల్లో ఉపయోగించిన భాషపై జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. మీకు అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి తిట్టేసి ఇప్పుడు జ్ఞానోదయం కలిగిందా.. ? అంటూ ఆయన ప్రశ్నించారు.
జనసేన పార్టీ, వైసిపి నేతల మధ్య కొంతకాలంగా ఘాటు విమర్శలు కొనసాగుతున్నాయి. తమ పార్టీ అధినేత జగన్ ను జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దూషించారంటూ వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశంలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఆ అంశంపై స్పందించారు.
నానాజీ మాటలను తాను ఎంకరేజ్ చేయనని అంటూనే వైసీపీ నేతలు గతంలో ఉపయోగించిన భాషపై పవన్ కళ్యాణ్ గట్టిగానే మాట్లాడారు.
పాలసీ పరంగా మాట్లాడితే వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చెయ్యడం, వ్యక్తిత్వ హననం చేసినప్పుడు గట్టిగా సమాధానం ఇవ్వక తప్పదు అన్నారు. మౌనంగా ఉన్నాం అని ఒక్కోసారి పేట్రేగిపోతారు. కాబట్టి మనం కూడా కొన్ని సందర్భాల్లో ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు సూచించారు.
అధికారం పోయినా, 11 సీట్లకే పరిమితం అయినా ఇంకా ఇష్టానికి నోటికొచ్చినట్టు దూషిస్తున్నారు. అది గొప్పతనం మీలో.. మీ కమిట్మెంట్ ను అభినందిస్తున్నానని పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులను ఉద్దేశించి సెటైర్లు వేశారు. 11 వచ్చినా భాష విషయంలో మేము తగ్గం అంటున్నారు. తగ్గకండి మీకు 1 వచ్చినా తగ్గకండి అలాగే ఉండండి ఆయన అన్నారు. మీరు మమ్మల్ని తిట్టకుండా ఉంటే మా పార్టీ నిర్మాణానికి చాలా సమయం ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
This post was last modified on June 27, 2026 1:48 pm
తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ పదేళ్ల కెరీర్లో పెద్దగా ఎఫైర్ వార్తలేమీ వచ్చింది లేదు.…
ప్రభాస్ సినిమా అంటే చాలు.. హైప్కు ఏమీ లోటు ఉండదు. రిలీజ్ దగ్గర పడేకొద్దీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ…
ఇదేమీ ఊహాజనిత వార్తకాదు. కొందరు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలో గత…
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఎప్పటి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్పడమే కాదు.. అంతర్జాతీయ వేదికలపైనా ఆయన తన వాణిని…
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…
టాలీవుడ్ దర్శకుల్లో శేఖర్ కమ్ములకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కమర్షియల్ లెక్కలకు దూరంగా సెన్సిబుల్ కథలతో ఫ్యామిలీ ఆడియన్స్,…