ఓ పరామర్శ అయినా, ఓ సాయం అయినా, ఓ ఓదార్పు అయినా, ఓ కేసు అయినా, ఓ పథకం అయినా… తాము కాకుండా మరెవ్వరూ చేయరాదన్న రీతిలో వైసీపీ నేతలు ఓ రేంజిలో ఫైరైపోతున్నారు. ఒక్కో పార్టీకి ఒక్కో ఐడియాలజీ ఉంటుందన్న కామన్ సూత్రాన్నీ వారు మరుస్తున్నారు. తమ పార్టీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అన్నీ చేయగలరని… ఆయనలా మరొకరు ఏ పనీ చేయలేరని వారు చెబుతున్న తీరు నిజంగానే జనాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. వెరసి తాము కొనసాగుతున్న వైసీపీని వారు మరింతగా దిగజారుస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఏ ఒక్క రాజకీయ పార్టీకి సాధ్యం కాని రీతిలో వంద శాతం ఫలితాలను సాదించిన జనసేన… ఏపీలో అదికార కూటమిలో కీలక బాగస్వామిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ వేస్తున్న ప్రతి అడుగూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాజకీయాల్లోకి రాకముందే తెలుగు నేల వ్యాప్తంగా అశేష జనాభిమానాన్ని చూరగొన్న పవన్… తన అభిమానుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇట్టే స్పందిస్తున్నారు. అందులో బాగంగానే ఆయన బుధవారం తెలంగాణకు చెందిన తన అభిమాని నిరంజన్ ను కలిసేందుకు హన్మకొండ అక్కడి దాకా వెళ్లారు.
పవన్ హన్మకొండ పర్యటన ఇంకా పూర్తిగా ముగియకముందే వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని మీడియా ముందు ప్రత్యక్షమైపోయారు. పవన్ తెలంగాణ టూర్ ను ఫుల్ గా ఫాలో అయ్యారో, ఏమో తెలియదు గానీ…పవన్ పర్యటనపై నాని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఎవడో అనారోగ్యంతో ఉన్నాను అనగానే పవన్ పరుగులు పెట్టి అక్కడికెళ్లిపోయారని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. పవన్ కు హన్మకొండలో జనం నీరాజనం పలకడంతో నాని ఈ తరహా వ్యాఖ్యలు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీలో ఉన్న సమస్యలను పట్టించుకోని పవన్… అక్కడెక్కడో తెలంగాణలో అన్నా నాకు బాగా లేదనగానే పరుగులు పెట్టారని నాని ఓ వింత వ్యాఖ్య చేశారు. ఏపీలో తన సొంత పార్టీ జనసేనకు చెందిన శ్రేణులకు నష్టం జరిగినా పవన్ స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. తన కుమారుడిని పోలీసులే చంపేశారని ఓ తల్లి మొరపెట్టుకుంటున్నా… ఆ దిశగా చూడని పవన్ తెలంగాణ అభిమాని వద్దకు పరుగులు పెట్టారని ఆరోపించారు.
తన ఇల్లును కూల్చేశారని ఓ జన సైనికుడు ఆవేదన వ్యక్తం చేసినా పవన్ స్పందిచడం లేదన్నారు. తక టీడీపీ నేతలు తనపై దౌర్జన్యం చేస్తున్నారని జన సైనికుడు ఫిర్యాదు చేసినా పవన్ కు చీమ కుట్టినట్టు కూడా లేదని ఆయన ఆరోపించారు. ఈ తరహా వ్యాఖ్యలతో వైసీపీపై ఇప్పటికే జనంలో ఉన్న వ్యతిరేకతను మరింతగా పెంచేస్తూ నాని ఈ తరహా వ్యాఖ్యలు చేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లోనూ జగన్ కు కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…