అమెరికానుంచి తరచుగా భారత్కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వలస విధానానికి సంబంధించి, హెచ్-1బీ వీసాలకు సంబంధించి కూడా భారత్కు అమెరికా నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇక, ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ.. సుంకాల విషయంలో ట్రంప్ మొండివాదన వినిపిస్తున్నారు. అయినప్పటికీ.. భారత్ ఎక్కడా అమెరికాకు సమాధానం ఇవ్వలేకపోతోంది. ప్రధాన మంత్రినరేంద్ర మోడీ పన్నెత్తు మాట కూడా అనలేక పోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పైగా.. ఆయనపై ఆరోపణలు చేసిన వారిని.. శత్రు దేశాలతో చేతులు కలిపారంటూ బీజేపీ నాయకులు ఎదురు దాడి చేస్తున్నారు.
వాస్తవానికి అమెరికా అధ్యక్షుడుగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. డొనాల్డ్ ట్రంప్ భారత్తో వ్యవహరించిన తీరు వేరుగా ఉంది. ప్రధాని మోడీతో ఆయన కలిసి కలివిడిగా మెలిగారు. కానీ, రెండో సారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత.. ట్రంప్ నిర్ణయాలు భారత్కు పలు సవాళ్లను రువ్వుతున్నాయి. ఇది భారత దేశానికే ఇబ్బందిగా మారుతోందని రాహుల్గాంధీ వంటి వారు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా-భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం కూడా.. తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందన్నారు. రైతులకు స్వేచ్ఛలేకుండా పోతుందని కూడా ఆరోపించారు.
తాజాగా మరింత..!
భారత్ విషయంలో అమెరికా తాజాగా వ్యవహరించిన తీరు ఏకంగా భారత సార్వభౌమాధికారాన్నే ప్రశ్నించేలా ఉందని నిపుణులు చెబుతున్నారు. రెండు రూపాల్లో అమెరికా వ్యవహరించిన తీరు.. భారత్ను మరింత ఇరకాటంలోకి నెట్టింది. దీని వల్ల దాయాది దేశం పాకిస్తాన్కు మరింతగా మనం చులకన అవుతున్నామన్న భావన కూడా వ్యక్తమవుతోందని చెబుతున్నారు. కనీసం ఈ విషయంలో అయినా.. ప్రధాని నరేంద్రమోడీ స్పందిస్తారా? లేదా? అంటూ.. జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. కానీ, ఇప్పటి వరకు భారత్ స్పందించలేదు.
ఏంటా రెండు అంశాలు?
1) అమెరికా పశ్చిమ తీరం నుంచి భారత్ పశ్చిమ తీరం వరకు ఉన్నసముద్ర ప్రాంతాన్ని.. `యూఎస్-ఇండో పసిఫిక్ తీరంగా పేర్కొంటూ.. 8 సంవత్సరాల కిందట పేరు పెట్టారు. తద్వారా.. ఈ తీరాన్ని భారత్-అమెరికా సంయుక్తంగా రక్షించుకునేందుకు, వినియోగించుకునేందుకు కూడా అవకాశం లభించింది. అయితే.. తాజాగా యూఎస్-ఇండోపసిఫిక్ పేరును యూస్ పసిఫిక్ పేరుగా మార్చేశారు. అంటే.. భారత్ పేరును తీసేశారు. పోనీ.. ఇదేమన్నా భారత్కు చెప్పి చేశారా? అంటే.. అది కూడా లేదు. ఇది ఏకపక్ష నిర్ణయం. పైగా అమెరికా దీనిని సమర్థించుకుంది.
2) భారత మ్యాప్లో ఉన్న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ను పూర్తిగా తొలగించేశారు. దీనిని పాకిస్థాన్ భూభాగంగా చూపిస్తూ.. మ్యాప్లో అమెరికా సంపూర్ణ మ్యాపులు చేసింది. అంతేకాదు.. దీనినే అధికారికంగా తాము గుర్తిస్తున్నామని కూడా ప్రకటించింది. ఇది పూర్తిగా భారత సార్వభౌమ అధికారంలోకి అమెరికా చొచ్చుకురావడమేనని నిపుణులు చెబుతున్నారు. భారత మ్యాప్లో పీఓకే కూడా కలిసి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు అమెరికా.. దీనిని పూర్తిగా పాకిస్థాన్ భూభాగంగా పేర్కొనడం తీవ్ర వివాదానికి దారితీసింది. మరి ఇప్పటికైనా ప్రధాని స్పందిస్తారో లేదో చూడాలి. చిత్రం ఏంటంటే.. ఫ్రాన్స్లో ప్రధాని మోడీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కానున్న గంటకు ముందు ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
This post was last modified on June 17, 2026 6:51 pm
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…