Political News

ఆంధ్రాకి ఆరు ఆడ పులులు కోరిన పవన్

రాష్ట్రంలో అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌డంతోపాటు.. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్య‌మంత్రి, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… తాజాగా రాష్ట్రానికి ఆరు పులుల‌ను పంపాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రంలో పులుల సంత‌తి త‌గ్గిపోతోంద‌ని.. వీటిని పెంచేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. ఈ క్ర‌మంలో ఆరు ఆడ‌పులుల‌ను పంపిస్తే.. రాష్ట్రంలో పెరిగే పులుల సంత‌తిని.. దేశ‌వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

రాష్ట్రంలోని న‌ల్ల‌మ‌ల‌లో పులుల సంచారం ఎక్కువ‌. అయితే.. గ‌త కొన్నాళ్లుగా వీటి సంత‌తి త‌గ్గుతోంది. అడ‌వుల ఆక్ర‌మ‌ణ‌, ర‌హ‌దారుల నిర్మాణం.. వాతావ‌ర‌ణ మార్పుల‌తో పులుల సంఖ్య త‌గ్గిపోయింద‌ని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కేంద్ర ప‌ర్యావర‌ణ‌, అట‌వీ శాఖ మంత్రి భూపేంద్ర యాద‌వ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల పై ఆయ‌న చ‌ర్చించారు.

ఏపీలోని పలు ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతులపై చర్చించారు. శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో బేస్ క్యాంపులు పెంచాలని కోరారు. బేస్ క్యాంపుల ఏర్పాటు కోసం కేంద్ర సహకారానికి భూపేంద్ర యాదవ్ సానుకూలంగా స్పందించారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులను అరికట్టడం కోసం . ‘హనుమాన్’ ప్రాజెక్ట్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో దాని వివ‌రాల‌ను కూడా కేంద్ర మంత్రికి వివ‌రించారు. అదేస‌మ‌యంలో అడ‌వుల్లో బేస్ క్యాంపుల నిర్మానం కోసం.. కేంద్రం నుంచి నిధులు కోరారు.

ఇక‌, న‌ల్ల‌మ‌ల‌లో పులుల సంత‌తి పెంచేందుకు వీలుగా.. మహారాష్ట్ర నుంచి 4, మధ్యప్రదేశ్ నుంచి 2 ఆడ పులుల‌ను ఏపీకి పంపించాల‌ని కోరారు. త‌ద్వారా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా పులుల సంత‌తి పెంచేందుకు కృషి చేస్తామ‌న్నారు. కాగా.. గ‌తంలో క‌ర్ణాట‌క నుంచి కుంకీ ఏనుగుల‌ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. వీటి ద్వారా అడ‌వుల‌పై దాడులు చేసే ఏనుగుల‌ను త‌రిమి కొట్ట‌డంతోపాటు.. ఏనుగుల‌ను హింసించ‌కుండా వ‌న్య‌ప్రాణి ర‌క్ష‌ణ‌కు ప‌వ‌న్ ప్ర‌య‌త్నం చేశారు.

This post was last modified on June 16, 2026 8:17 pm

Share

Recent Posts

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

2 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

3 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

5 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

6 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

7 hours ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

9 hours ago