రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్… తాజాగా రాష్ట్రానికి ఆరు పులులను పంపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పులుల సంతతి తగ్గిపోతోందని.. వీటిని పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఆరు ఆడపులులను పంపిస్తే.. రాష్ట్రంలో పెరిగే పులుల సంతతిని.. దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.
రాష్ట్రంలోని నల్లమలలో పులుల సంచారం ఎక్కువ. అయితే.. గత కొన్నాళ్లుగా వీటి సంతతి తగ్గుతోంది. అడవుల ఆక్రమణ, రహదారుల నిర్మాణం.. వాతావరణ మార్పులతో పులుల సంఖ్య తగ్గిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల పై ఆయన చర్చించారు.
ఏపీలోని పలు ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతులపై చర్చించారు. శ్రీశైలం టైగర్ రిజర్వ్లో బేస్ క్యాంపులు పెంచాలని కోరారు. బేస్ క్యాంపుల ఏర్పాటు కోసం కేంద్ర సహకారానికి భూపేంద్ర యాదవ్ సానుకూలంగా స్పందించారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులను అరికట్టడం కోసం . ‘హనుమాన్’ ప్రాజెక్ట్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాని వివరాలను కూడా కేంద్ర మంత్రికి వివరించారు. అదేసమయంలో అడవుల్లో బేస్ క్యాంపుల నిర్మానం కోసం.. కేంద్రం నుంచి నిధులు కోరారు.
ఇక, నల్లమలలో పులుల సంతతి పెంచేందుకు వీలుగా.. మహారాష్ట్ర నుంచి 4, మధ్యప్రదేశ్ నుంచి 2 ఆడ పులులను ఏపీకి పంపించాలని కోరారు. తద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగంగా పులుల సంతతి పెంచేందుకు కృషి చేస్తామన్నారు. కాగా.. గతంలో కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వీటి ద్వారా అడవులపై దాడులు చేసే ఏనుగులను తరిమి కొట్టడంతోపాటు.. ఏనుగులను హింసించకుండా వన్యప్రాణి రక్షణకు పవన్ ప్రయత్నం చేశారు.
This post was last modified on June 16, 2026 8:17 pm
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…