హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు అవుతారు అంటూ ప్రశ్నలు మొదలవుతాయి. దీని మీద రూమర్లకూ కొదవేమీ ఉండదు. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఒక స్టార్ హీరోయిన్ తల్లి కాబోతోందన్న విషయం సినీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఆ హీరోయిన్ ఎవరు అన్నదాని మీద సోషల్ మీడియాలో తెగ చర్చలు జరిగిపోతున్నాయి.
ఈ శుక్రవారం మాఇంటి బంగారం సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ముందుగా సమంత మీదికి నెటిజన్ల దృష్టి మళ్లింది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం సమంత చీర కట్టుకుని రాగా.. ప్రెగ్నెన్సీని కవర్ చేయడానికే చీరలో వచ్చిందంటూ కొందరు అనుమానంగా చూడడం మొదలుపెట్టారు. కానీ సినిమాలో పాత్రకు తగ్గట్లే చీరలో వచ్చింది తప్ప సామ్ గర్భవతి అనే వార్తల్లో నిజమేమీ లేదని తెలుస్తోంది.
రాజ్ నిడిమోరుతో సమంత పెళ్లి జరిగి ఏడాది కూడా కాలేదు. పైగా కెరీర్ మీద సమంత గట్టిగా ఫోకస్ చేసిన నేపథ్యంలో ఆమెకు ఇప్పుడే పిల్లల్ని కనే ఆలోచన ఉందా అన్నది సందేహమే. మరోవైపు తెలుగు వారికి ఎంతో చేరువైన మలయాళ భామ కీర్తి సురేష్ మీదా ప్రేక్షకుల దృష్టి మళ్లుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న తన కాలేజీ రోజుల నాటి స్నేహితుడు ఆంటోనీని కీర్తి రెండేళ్ల ముందు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
కెరీర్ మంచి ఊపులో ఉండగానే పెళ్లి చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చిన ఆమె.. ఇప్పుడు ఎక్కువ ఆలస్యం చేయకుండా బిడ్డను కనడానికి రెడీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. కీర్తికి తెలుగులో ఒక్క సినిమానే ఉంది. విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్ధనలో నటిస్తోంది. ఆ సినిమాలో తన పోర్షన్స్ ఎంత వరకు వచ్చాయో కానీ.. ఇప్పుడు ఆమె గర్భం దాల్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి తల్లి కాబోతున్నట్లుగా వార్తల్లో ఉన్న సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తియేనా ఇంకొకరా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…