ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఇటీవల కొందరు నేతలు.. మేధావులమని చెప్పుకొనే కొందరు విమర్శలు చేస్తున్నారు. పనులు మందగించాయని.. పనిచేస్తున్న కార్మికులు కూడా వెళ్లిపోతున్నారని.. వారు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు ప్రధాన మీడియా చర్చల్లోనూ విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు వేసవి కాలంలోనే పనులు ముందుకు సాగడం లేదని.. వర్షాకాలం ప్రారంభమైతే.. ఇక, పనులు సాగవని వారు పేర్కొన్నారు.
ఈ క్రమంలో అమరావతిపై కామెంట్స్ చేసేవారికి.. తాజాగా మంత్రి లోకేష్ వీడియోతో సమాధానం ఇచ్చారు. అమరావతిలో నిరంతరాయంగా జరుగుతున్న పనులకు సంబంధించిన వీడియోను ఆయన పోస్టు చేశారు. వర్షాకాలం.. వేసవి కాలం అనే తేడా లేకుండా.. ఇక్కడ పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు.. పూర్తయ్యాయని.. మరో రెండు మూడు రోజుల్లోనే వీటిని ప్రభుత్వానికి అప్పగించనున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇక, రెండో దశ భూ సమీకరణకు రైతులు సహకరించడం లేదన్న విమర్శలకు కూడా చెక్ పెట్టారు. రైతులు తాజాగా 70 ఎకరాల భూములను సీఆర్ డీఏ అధికారులకు మంత్రి నారాయణ సమక్షంలో ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. సీఎం చంద్రబాబు రాజధాని పనులపై నిరంతరం పర్యవేక్షిస్తున్న తీరును కూడా వివరించారు. కాలం ఏదైనా అమరావతి కాలం నడుస్తోందని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరును చూసి కొందరు విమర్శలు చేస్తున్న తీరును ఆయన ఖండించారు.
అన్ స్టాపబుల్
అమరావతి పనులు అన్ స్టాపబుల్ అని నారా లోకేష్ తెలిపారు. నిర్మాణాలు టాప్ గేర్లో ముందుకు సాగుతున్నాయన్నారు. వర్షం పడితే అమరావతి మునిగిందంటూ ట్రోల్ చేసే వారికి సారీ బ్రో అని సెటర్లు వేశారు. అమరావతిపై ట్రోల్ చేసేవారు చాలా కష్టపడుతున్నారు. అందుకే.. ఈ వీడియో అని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణ పనుల్లో పాజ్ అనే పదమే వినిపించదని పేర్కొన్నారు.
This post was last modified on June 14, 2026 7:33 pm
మలయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తన మాతృభాషలో గొప్ప గొప్ప సినిమాలు చేశాడు. ఎన్నో సూపర్…
ఉత్తరప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత రామజన్మభూమి అయోధ్యలో ఉన్న బాలరామయ్య ఆలయానికి రాజకీయ గ్రహణం వీడినట్టేనా? ఇక, ఆలయానికి రాజకీయ ప్రభావం,…
సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్…
టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…
ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…
తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…