దర్శకుడు లారెన్స్ రాఘవేంద్ర హీరోగా ఆయన డైరెక్షన్లోనే రూపొందుతున్న కాంచన 4 షూటింగ్ కీలక దశకు చేరుకుంది. ఇందులో ముఖ్యమైన స్పెషల్ రోల్ కు నయనతారను సంప్రదించాడనే వార్త చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ కాగా ఇంకో ముఖ్యమైన క్యారెక్టర్ నోరా ఫతేహి చేస్తోంది. అలాంటప్పుడు నయన్ కు స్కోప్ ఎక్కడ ఉందనేది సస్పెన్స్ గా మారింది. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం దానికి సమాధానం ఇలా ఉంది.
కాంచన 4లో పూజా హెగ్డే పాత్రకు దెయ్యం ఛాయలు ఉంటాయట. అంటే కథ ప్రకారం లారెన్స్ సినిమాల్లో రెగ్యులర్ గా ఒక హీరోయిన్ కి పట్టే ఆత్మ ఇందులో పూజని వరిస్తుందట. ఈ క్రమంలో వచ్చే పెర్ఫార్మన్స్ పీక్స్ లో ఉంటుందని యూనిట్ టాక్. నోరా ఫతేహికి నెగటివ్ టచ్ ఇచ్చారని వినికిడి. ఇక నయనతారని కోడిరామకృష్ణ అమ్మోరు క్లైమాక్స్ లా ఫుల్ గూస్ బంప్స్ వచ్చే తరహాలో లారెన్స్ డిజైన్ చేసుకున్నాడని టాక్. నిజమెంతో టీజరో ట్రైలరో వచ్చాక క్లారిటీగా అర్థమవుతుంది.
ఇంకా విడుదల తేదీ ఖరారు కాని కాంచన 4ని ఈ ఏడాది రిలీజ్ చేయాలని లారెన్స్ ఫిక్స్ అయ్యాడు. బిజినెస్ ఆఫర్స్ క్రేజీగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు వెర్షన్ కు భారీ రేట్ పలకొచ్చట. ముని నుంచి ఇప్పటిదాకా ఈ సిరీస్ లో వచ్చినవన్నీ ఏపీ తెలంగాణలో కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అయ్యాయి. కాంచన 3కి నెగటివ్ రివ్యూలు,టాక్ వచ్చినా జనం చూశారు. మొదటి వారం రోజులు మెయిన్ సెంటర్స్ అన్నీ హౌస్ ఫుల్ అయ్యే రేంజ్ లో ఆ బొమ్మ ఆడింది.
ఇప్పుడు కాంచన 4కి మరో అడ్వాంటేజ్ ఉంటుంది. దేవుళ్ళు దేవతలను ఆధారంగా చేసుకుని వస్తున్న సినిమాలు మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. వీరభద్రుడులో ఎన్ని లోపాలు, తప్పులు ఉన్నా డివోషనల్ ఎలిమెంట్ జనాలకు బాగా కనెక్ట్ అయిపోయింది. అందుకే నెల రోజుల తర్వాత కూడా తమిళనాడులో థియేటర్ రన్ బలంగా ఉంది. అలాంటివి కాంచన 4లో చాలా ఉన్నాయట. అందుకే నయన్ ఎంట్రీ చేస్తోందని వినికిడి. చూడాలి లారెన్స్ ఇంకేమేం వండుతాడో.
This post was last modified on June 14, 2026 11:38 am
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవల ప్రకటించిన `పాఠశాలల అభివృద్ధి` కార్యక్రమానికి 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలే…
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…
తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…
జాతిరత్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న కథానాయిక.. ఫరియా అబ్దుల్లా. థియేటర్ బ్యాగ్రౌండ్ నుంచి…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అటవీశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన చేసిన ఒకే ఒక్క ఆలోచన.. 5…