Political News

నయా మోసం… బాబుతో వీడియో కాల్

ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోయారు. బాబు మీతో మాట్లాడతారని చెప్పి… విశాఖకు చెందిన ఓ వ్యక్తిని బుట్టలో వేసేసిన సైబర్ నేరగాళ్లు.. బాదితుడి ఫోన్ కు ఏఐ సాయంతో బాబుతోనే మాట్లాడించారు. ఇంకేముంది… స్వయంగా సీఎం చంద్రబాబే తనతో మాట్లాడారన్న భావనతో వ్యక్తి సైబర్ నేరగాళ్లు అడిగిన డబ్బు ఇస్తూ పోయారు. రూ.80 వేల మొత్తాన్ని చెల్లించుకున్న తర్వాత గానీ ఆ బాధితుడికి తాను మోసపోయానని తెలియలేదు.

అందరినీ షాక్ కు గురి చేసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే… విశాఖకు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఓ భూవివాదం పరిష్కారం నిమిత్తం తన వంతు యత్నాలు సాగించారు. ఈ విషయం తెలుసుకున్న నిందితులు ఓ హైటెక్ సైబర్ మోసానికి తెర తీశారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్ తోనూ మాట్లాడి మీ సమస్యను ఇట్టే పరిష్కరిస్తామని నిందితులు చెప్పడంతో రెడ్డి నమ్మేశారు. వారు అడిగిన మేర సొమ్మును చెల్లిస్తూ వచ్చారు.

ఈ క్రమంలో ఓ సారి చంద్రబాబు పిక్ తో కూడిన వాట్సాప్ కాల్ రెడ్డి ఫోన్ కు వచ్చింది. ఆ ఫోన్ నేరుగా చంద్రబాబు నుంచే వచ్చిందన్న భావనతో రెడ్డి సంభ్రమాశ్యర్యాలకు గురి అయ్యారు. ఏఐ సాయంతో నిందితులు చేసిన ఈ ఫోన్ కాల్ లో చంద్రబాబు ఫొటోతో పాటు చంద్రబాబు వాయిస్ కూడా అచ్చుగుద్దినట్టుగా సరిపోయింది. దీంతో రెడ్డి తన సమస్యను ఏకరువు పెట్టారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖుల వద్దకూ వెళ్లానని, అయినా తనకు న్యాయం జరగలేదని ఆయన వాపోయారు. ఈ క్రమంలో అంతా తాను చూసుకుంటానని బాబు వాయిస్ వినిపించగానే రెడ్డి అతిశయానికి గురయ్యారు.

తీరా ఎన్ని రోజులు అయినా తన సమస్య పరిష్కారం కాకపోవడం, నేరుగా చంద్రబాబు ఈ విషయంలోకి ఎంట్రీ ఇచ్చినా పని కాకపోవడంతో రెడ్డికి ఓ మోస్తరు అనుమానం వచ్చింది. వెంటనే తన మిత్రులతో ఈ విషయం చెప్పగానే వారంతా… ఇదేదో మోసంగానే ఉందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో రెడ్డి నేరుగా పోలీసులను ఆశ్రయించారు. జరిగినదంతా రెడ్డి చెప్పడంతో హైటెక్ స్థాయి భారీ సైబర్ మోసం జరిగినట్లు పోలీసులు తేల్చారు. రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం ఆరా తీస్తున్నారు.

This post was last modified on June 13, 2026 3:51 pm

Share

Recent Posts

ఓటుకు నోటు తీసుకోవడం మానేయలేమా

ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…

32 minutes ago

సోనియా వందేమాతరాన్ని ఆపమన్నారా

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…

2 hours ago

`కాక్రోచ్‌`లు మ‌ళ్లీ ప‌ని మొద‌లు పెట్టేశారు…

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవ‌ల ప్ర‌క‌టించిన `పాఠ‌శాల‌ల అభివృద్ధి` కార్య‌క్ర‌మానికి 80వ స్వాతంత్ర దినోత్స‌వం వేడుక‌లే…

3 hours ago

జండా పండగ జరుపుకోలేదా జగన్?

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…

4 hours ago

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

11 hours ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

11 hours ago