లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం తీసిన అత్యుత్తమ చిత్రాల్లో దీన్ని ఒకటిగా చెప్పొచ్చు. ఎప్పుడు చూసినా అది గొప్పగానే అనిపిస్తుంది. ఈ చిత్రం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, కరుణానిధిల జీవితాల ఆధారంగా తీసిన సినిమా అన్నది తెలిసిన విషయమే. ఆ పాత్రలను మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ పోషించారు. వీరి కలయికలో ఆ చిత్రంలో ఎన్నో ఐకానిక్ సీన్లు ఉంటాయి. అందులో టెర్రస్ సీన్ ఒకటి.
మేడ మీద మాట్లాడుకుంటుండగా మోహన్ లాల్ను రాజకీయాల్లోకి రమ్మని ప్రకాష్ రాజ్ ఆహ్వానిస్తే.. సినిమా నటుడినైన తాను రాజకీయాల్లోకి రావడమేంటి అంటూ లాల్ అభ్యంతరం చెబుతాడు. అప్పుడు అలా మాట్లాడుకుంటూ ముందుకు నడిచి వస్తే ఒక పెద్ద జనసందోహం నిలబడి ఉంటుంది. వారికి లాల్ అభివాదం చేయగానే జనం సంబరం మామూలుగా ఉండదు. ఆ ఆదరణను చూపిస్తూ.. నువ్వు రాజకీయాల్లోకి వస్తే చరిత్ర సృష్టిస్తావంటూ ప్రకాష్ రాజ్ తనను పాలిటిక్స్ వైపు మళ్లిస్తాడు.
ఈ సన్నివేశానికి స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి అట. ఈ విషయాన్ని ఒక మలయాళ ఇంటర్వ్యూలో అలనాటి హీరోయిన్, మణిరత్నం సతీమణి సుహాసిని వెల్లడించడం విశేషం. తాను, చిరంజీవి కలిసి ఒక సినిమా చేసినపుడు తిరుపతికి వెళ్లినప్పటి అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.
తాను, చిరు ఒక ఇంటి మేడ మీద మాట్లాడుకుంటూ ఉంటే తన ఫాలోయింగ్ గురించి చిరు తక్కువ చేసి మాట్లాడాడని.. అప్పుడు కాస్త ముందుకు వచ్చి చూస్తే మొత్తం తిరుపతి జనం అంతా చిరు కోసం ఎదురు చూస్తున్న దృశ్యం కనిపించిందని.. ఇదే విషయాన్ని తాను తన భర్త మణిరత్నంతో పంచుకుంటే, ఆయన ‘ఇద్దరు’ సినిమాలో ఒక ఐకానిక్ సీన్ను క్రియేట్ చేశారని సుహాసిని వెల్లడించారు.
ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు మరింత చేరువయ్యేలా వ్యవహరిస్తున్నారు. ఎవరో రావాలి.. ఏదో చెప్పాలి.. అని ఎదురు చూడకుండా.. ప్రజల…
సీనియర్ హీరోయిన్ స్నేహ మరోసారి తన అందమైన ఫొటోలతో అభిమానులను పలకరించింది. తాజాగా షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో…
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎప్పుడెలా మారిపోతుందో తెలియక జనాలే కాదు.. ఆ పార్టీ నేతలు…
రోజుకు 8 గంటలకు మించి పని చేయనంటూ ఈ మధ్య దీపిక పదుకొనే ఫిలిం మేకర్స్కు కండిషన్ పెట్టడం ఎంత…
నిజమే... టీడీపీ అదినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఏ విషయంలో అయినా అంత ఈజీ అయితే కాదనే చెప్పాలి. ఏ…
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరోసారి తన స్టైలిష్ లుక్తో అందరి దృష్టిని ఆకర్షించింది. థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరిగిన షిసెడో…