Movie News

మణిరత్నం ఐకానిక్ సీన్ వెనుక వెనుక చిరు

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం తీసిన అత్యుత్తమ చిత్రాల్లో దీన్ని ఒకటిగా చెప్పొచ్చు. ఎప్పుడు చూసినా అది గొప్పగానే అనిపిస్తుంది. ఈ చిత్రం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, కరుణానిధిల జీవితాల ఆధారంగా తీసిన సినిమా అన్నది తెలిసిన విషయమే. ఆ పాత్రలను మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ పోషించారు. వీరి కలయికలో ఆ చిత్రంలో ఎన్నో ఐకానిక్ సీన్లు ఉంటాయి. అందులో టెర్రస్ సీన్ ఒకటి.

మేడ మీద మాట్లాడుకుంటుండగా మోహన్ లాల్‌ను రాజకీయాల్లోకి రమ్మని ప్రకాష్ రాజ్ ఆహ్వానిస్తే.. సినిమా నటుడినైన తాను రాజకీయాల్లోకి రావడమేంటి అంటూ లాల్ అభ్యంతరం చెబుతాడు. అప్పుడు అలా మాట్లాడుకుంటూ ముందుకు నడిచి వస్తే ఒక పెద్ద జనసందోహం నిలబడి ఉంటుంది. వారికి లాల్ అభివాదం చేయగానే జనం సంబరం మామూలుగా ఉండదు. ఆ ఆదరణను చూపిస్తూ.. నువ్వు రాజకీయాల్లోకి వస్తే చరిత్ర సృష్టిస్తావంటూ ప్రకాష్ రాజ్ తనను పాలిటిక్స్ వైపు మళ్లిస్తాడు.

ఈ సన్నివేశానికి స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి అట. ఈ విషయాన్ని ఒక మలయాళ ఇంటర్వ్యూలో అలనాటి హీరోయిన్, మణిరత్నం సతీమణి సుహాసిని వెల్లడించడం విశేషం. తాను, చిరంజీవి కలిసి ఒక సినిమా చేసినపుడు తిరుపతికి వెళ్లినప్పటి అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.

తాను, చిరు ఒక ఇంటి మేడ మీద మాట్లాడుకుంటూ ఉంటే తన ఫాలోయింగ్ గురించి చిరు తక్కువ చేసి మాట్లాడాడని.. అప్పుడు కాస్త ముందుకు వచ్చి చూస్తే మొత్తం తిరుపతి జనం అంతా చిరు కోసం ఎదురు చూస్తున్న దృశ్యం కనిపించిందని.. ఇదే విషయాన్ని తాను తన భర్త మణిరత్నంతో పంచుకుంటే, ఆయన ‘ఇద్దరు’ సినిమాలో ఒక ఐకానిక్ సీన్‌ను క్రియేట్ చేశారని సుహాసిని వెల్లడించారు.

Kumar

Recent Posts

ముద్ర‌గ‌డ‌తో వంగ‌వీటి కుమార్తె భేటీ?

కాపు ఉద్య‌మ మాజీ నాయ‌కుడు, ప్ర‌స్తుత వైసీపీ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంతో ప్ర‌ముఖ నాయ‌కుడు, దివంగత వంగ‌వీటి రంగా కుమార్తె..…

7 minutes ago

శర్వానంద్ ‘భోగి’కి భలే కలిసి వచ్చింది

కొన్నిసార్లు అంతే అనుకోకుండా అదృష్టం తలుపు తట్టేస్తుంది. దాన్ని వాడుకోవడం తెలిసుండాలి అంతే. ప్రస్తుతం శర్వానంద్ తో భోగి తీస్తున్న…

57 minutes ago

విజయ్ దేవరకొండ అంటే అంత ప్రేమ

దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంత సెలెక్టివ్ గా ఉంటారో తెలిసిందే. కథలు, క్యాస్టింగ్, టీమ్, కంటెంట్ ఏదైనా సరే రాజీ…

1 hour ago

సింగీతానికి ప్రాణం పోసావయ్యా దేవి

భారతీయ సినిమాలో ఇంకెవరికీ సాధ్యం కాని రీతిలో 94 ఏళ్ల వయసులో ఫీచర్ ఫిలిం తీసి అబ్బురపరిచారు సింగీతం శ్రీనివాసరావు.…

1 hour ago

ముందు పగ… తర్వాతే అభివృద్ది అంటే ఎలా జగన్?

2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం పక్కా అని భావించిన వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. అంతే అప్పటిదాకా ఓ రేంజిలో…

2 hours ago

‘వర్క్ ఆన్ బైక్’… ఇది టూ మచ్ గురు!

కరోనా మహమ్మారి పుణ్యమా అని వర్క్ ఫ్రమ్ హోమ్ మన జీవనయానంలో ఓ విదానం అయితే… ఆ తీరు ప్రభావం…

3 hours ago