లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం తీసిన అత్యుత్తమ చిత్రాల్లో దీన్ని ఒకటిగా చెప్పొచ్చు. ఎప్పుడు చూసినా అది గొప్పగానే అనిపిస్తుంది. ఈ చిత్రం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, కరుణానిధిల జీవితాల ఆధారంగా తీసిన సినిమా అన్నది తెలిసిన విషయమే. ఆ పాత్రలను మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ పోషించారు. వీరి కలయికలో ఆ చిత్రంలో ఎన్నో ఐకానిక్ సీన్లు ఉంటాయి. అందులో టెర్రస్ సీన్ ఒకటి.
మేడ మీద మాట్లాడుకుంటుండగా మోహన్ లాల్ను రాజకీయాల్లోకి రమ్మని ప్రకాష్ రాజ్ ఆహ్వానిస్తే.. సినిమా నటుడినైన తాను రాజకీయాల్లోకి రావడమేంటి అంటూ లాల్ అభ్యంతరం చెబుతాడు. అప్పుడు అలా మాట్లాడుకుంటూ ముందుకు నడిచి వస్తే ఒక పెద్ద జనసందోహం నిలబడి ఉంటుంది. వారికి లాల్ అభివాదం చేయగానే జనం సంబరం మామూలుగా ఉండదు. ఆ ఆదరణను చూపిస్తూ.. నువ్వు రాజకీయాల్లోకి వస్తే చరిత్ర సృష్టిస్తావంటూ ప్రకాష్ రాజ్ తనను పాలిటిక్స్ వైపు మళ్లిస్తాడు.
ఈ సన్నివేశానికి స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి అట. ఈ విషయాన్ని ఒక మలయాళ ఇంటర్వ్యూలో అలనాటి హీరోయిన్, మణిరత్నం సతీమణి సుహాసిని వెల్లడించడం విశేషం. తాను, చిరంజీవి కలిసి ఒక సినిమా చేసినపుడు తిరుపతికి వెళ్లినప్పటి అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.
తాను, చిరు ఒక ఇంటి మేడ మీద మాట్లాడుకుంటూ ఉంటే తన ఫాలోయింగ్ గురించి చిరు తక్కువ చేసి మాట్లాడాడని.. అప్పుడు కాస్త ముందుకు వచ్చి చూస్తే మొత్తం తిరుపతి జనం అంతా చిరు కోసం ఎదురు చూస్తున్న దృశ్యం కనిపించిందని.. ఇదే విషయాన్ని తాను తన భర్త మణిరత్నంతో పంచుకుంటే, ఆయన ‘ఇద్దరు’ సినిమాలో ఒక ఐకానిక్ సీన్ను క్రియేట్ చేశారని సుహాసిని వెల్లడించారు.
This post was last modified on June 13, 2026 1:30 pm
'ఫౌజీ' సినిమా నుంచి ఇప్పటిదాకా వచ్చిన పోస్టర్లు చూస్తుంటే మేకర్స్ ఇంటెన్షన్ క్లియర్ గా అర్థమవుతోంది. ప్రభాస్ ను సాఫ్ట్…
ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవల ప్రకటించిన `పాఠశాలల అభివృద్ధి` కార్యక్రమానికి 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలే…
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…