రాష్ట్రంలో కూటమిప్రభుత్వంఏర్పడి జూన్ 12కు రెండేళ్లు పూర్తయ్యాయి. 2024లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. దీంతో తరచుగా ఆయన పనితీరు.. విధానం వంటివాటిపై సమాజంలో చర్చ సాగుతూనే ఉంది. రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ.. ఓ ఉప ముఖ్యమంత్రిగా, అటవీ, పర్యావరణ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఆయన పనితీరుపై ప్రజలు నిశితంగానే గమనిస్తారని అంటున్నారు. అందుకే పవన్ కల్యాణ్ కూడా తన శాఖలను చాలా సీరియస్గా తీసుకుంటున్నారు.
పంచాయతీలు: పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ తాను ఈ బాధ్యతలు చేపట్టాక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చే నిధులను నేరుగా వాటికే చేరేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేలా సీఎం ను ఒప్పించారు. ఫలితంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలకు నిధుల కొరత లేకుండా పోయింది. అంతేకాదు.. కేంద్రం అమలు చేస్తున్న జల్జీవన్ మిషన్, గ్రామీణ సడక్యోజన వంటివాటిని అందిపుచ్చుకుని.. పంచాయతీలను మెరుగైన రీతిలో అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవల ఐదు అవార్డులు రావడం.. పవన్ పనితీరుకు నిదర్శనం.
అడవులు: అటవీ శాఖ మంత్రిగా కూడా.. పవన్కు మంచి మార్కులు పడ్డాయి. రెండేళ్లలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అటవీ పరిరక్షణ విషయంలో సమాజంలో చర్చించేలా ఆయన వ్యవహరించారు. సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంతోపాటు.. సముద్రతీరాలను పచ్చదనంతో నింపే ప్రణాళికలు అమలు చేసే దిశగా అడుగులు వేశారు. అదేవిధంగా ఏనుగుల గుంపుల ద్వారా జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తీసుకువచ్చారు. అలానే.. జంతువుల దాడుల కారణంగా మృతి చెందే వారి కుటుంబాలను ఆదుకునేందుకు పరిహారాన్ని డబుల్ చేశారు. ఇవన్నీమేలైన ఫలితాలు ఇస్తున్నాయి.
ఉపముఖ్యమంత్రిగా: ఇక, పూర్తిస్థాయిలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్.. తనకు కేటాయించిన శాఖలపైనే కాకుండా.. అన్ని శాఖలపైనా మాట్లాడేందుకు.. చర్యలు తీసుకునేందుకు, ఆదేశించేందుకు కూడా అవకాశం ఉంది. పొరుగు రాష్ట్రాల్లో ఇది కనిపిస్తోంది. కానీ, పవన్ ఎప్పుడూ హద్దులు మీరలేదు. ఒకే ఒక్కసారి హోం శాఖ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా.. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను బట్టేనని చెప్పాలి. అంటే.. ఒక రకంగా.. తన హద్దులు ఎప్పుడూ.. పవన్ కల్యాణ్ దాటలేదు. దీంతో ఉపముఖ్యమంత్రి కూడా ఆయన మంచి మార్కులే వేయించుకున్నారు.
రెండేళ్లలో అచ్చంగా పవన్ చేపట్టిన కార్యక్రమాలు ఇవీ..
1) పల్లె పండుగ: 4,000 కిలోమీటర్లకు పైగా సిమెంట్ కాంక్రీట్ (CC) రోడ్లు, వ్యవసాయ చెరువులు, పశువుల షెల్టర్ల నిర్మాణాన్ని సులభతరం చేసిన ఒక ప్రధాన గ్రామీణ మౌలిక సదుపాయాల కార్యక్రమం.
2) అడవితల్లి బాట: రాష్ట్రవ్యాప్తంగా మారుమూల గిరిజన గ్రామాలను అనుసంధానించడం, అభివృద్ధి చేయడంపై దృష్టి సారించిన పథకం. దీనికి 1,005 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రణాళిక చేశారు.
3) మన ఊరు-మాటా మంతీ: గ్రామ సమస్యలను నేరుగా పరిష్కరించడానికి, స్థానిక పౌర సౌకర్యాలను అమలు చేయడానికి సాంకేతికతను ఉపయోగించుకునే భాగస్వామ్య పాలన కార్యక్రమం.
4) ‘అమరజీవి జలధార’: 2027 నాటికి 1.21 కోట్ల మందికి సురక్షితమైన తాగునీటిని అందించేందుకు రూపొందించిన పథకం. రూ. 7,910 కోట్ల విలువైన రాష్ట్ర స్థాయి వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్.
5) ప్రాజెక్ట్ హనుమాన్ : వన్యప్రాణుల పర్యవేక్షణ, సహాయం, సంరక్షణ, చికిత్స , పోషణ కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమం.
6) సీడ్ బాల్స్ డ్రైవ్: విత్తన గుళికల సేకరణ కార్యక్రమం. భారీస్థాయి అటవీకరణ, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పర్యావరణ కార్యక్రమం.
కమల్ హాసన్ అభిమానులే మర్చిపోయిన పేరు ఇండియన్. మొన్న ఏడాది దీని రెండో భాగం వచ్చి ఎంత డిజాస్టర్ అయ్యిందో…
విద్యాశాఖ మంత్రిగా టీడీపీ యువ నాయకుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్.. నారా లోకేష్ దూకుడు చూపిస్తున్నారు. నిజానికి విద్యా శాఖ…
ఈ రోజు విడుదలైన సింగ్ గీతం కమర్షియల్ గా ఎంత వసూలు చేస్తుంది, నిర్మాతలకు డబ్బులు ఇస్తుందా లేదానేది పక్కనపెడితే…
ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ…
తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…