ఈ రోజు విడుదలైన సింగ్ గీతం కమర్షియల్ గా ఎంత వసూలు చేస్తుంది, నిర్మాతలకు డబ్బులు ఇస్తుందా లేదానేది పక్కనపెడితే టాలీవుడ్ ఒక అదృష్టానికి నోచుకుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే 94 వయసులో దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ ఈ సినిమాని తెరకెక్కించడం కొన్ని వేల మందికి స్ఫూర్తినివ్వడం ఖాయం. అలాని ఆయనేదో అవుట్ అఫ్ ట్రెండ్ మూవీ తీశారనుకుంటే పొరపాటే. ప్రీమియర్ రిపోర్ట్స్ ఇదే స్పష్టం చేస్తున్నాయి.
సంగీతాన్ని ప్రధానంగా వాడుకుంటూ పాత్రల మధ్య బంధాలను, కథలోని సంఘర్షణకు ఇంత కొత్తగా ఎవరు చెప్పగలరన్న రీతిలో సింగీతం వారి స్క్రీన్ ప్లే మేజిక్ చేసిందనే చెప్పాలి. సగటు మాస్ ప్రేక్షకులకు ఇలాంటివి ఏ మేరకు కనెక్ట్ అవుతాయో చెప్పలేం కానీ గత కొన్నేళ్లలో వచ్చిన చాలా మూస చిత్రాల కంటే ఈ సింగ్ గీతం ఎన్నోరెట్లు మెరుగ్గా ఉన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. కొన్ని ఫ్రేమ్స్, సీన్స్ చూస్తే అసలీయన ఎలా ఆలోచించారా అని ఆశ్చర్యం కలుగుతుంది.
ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ నుంచి సంగీతాన్ని రాబట్టుకున్న వైనం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది . డైరెక్షన్, నిర్మాణంలో నాగ్ అశ్విన్ చేయూత ఉండొచ్చు గాక. అయినా సరే సింగీతం వారి ముద్ర ఆణువణువూ ఉట్టి పడుతుంది. న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్ పేరుతో బోల్డ్ కంటెంట్, హింసని జనాల మీద రుద్దుతూ ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయని చెప్పుకునే ఎందరో దర్శకులకు సింగీతం వారు తీసుకున్న చిన్న క్లాసుగా ఈ సింగ్ గీతంని వర్ణించవచ్చు.
కొందరికి ఇక్కడ చెప్పినంత గొప్పగా సినిమా అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. కానీ ప్రయత్న లోపం లేని ఒక నిజాయితిని ఆవిష్కరించారని మాత్రం బల్లగుద్ది చెప్పొచ్చు. అందులోనూ స్టార్ క్యాస్టింగ్ లేకుండా కొత్త జంటను తీసుకుని ఈ ఎక్స్ పరిమెంట్ చేయడం అంటే మాటలు కాదు. మూవీ లవర్స్ మిస్ చేయకూడని అనుభూతి ఇది. సింగీతం శ్రీనివాసరావు గారి సాహసానికి ఒక వేదిక ఇచ్చే అదృష్టం అందుకున్న ఘనత వైజయంతికి కాదు యావత్ టాలీవుడ్ కు దక్కుతుంది.
కమల్ హాసన్ అభిమానులే మర్చిపోయిన పేరు ఇండియన్. మొన్న ఏడాది దీని రెండో భాగం వచ్చి ఎంత డిజాస్టర్ అయ్యిందో…
విద్యాశాఖ మంత్రిగా టీడీపీ యువ నాయకుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్.. నారా లోకేష్ దూకుడు చూపిస్తున్నారు. నిజానికి విద్యా శాఖ…
రాష్ట్రంలో కూటమిప్రభుత్వంఏర్పడి జూన్ 12కు రెండేళ్లు పూర్తయ్యాయి. 2024లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు జనసేన అధినేత…
ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ…
తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…