జగన్ వాయిస్ లో బేస్ తగ్గింది

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక బహిరంగ సభల్లో అయితే ఆయన వాయిస్ నిజంగానే సింహనాదంలా వినిపిస్తుంది. తన రాజకీయ ప్రత్యర్థులను తూలనాడే సమయంలో జగన్ వాయిస్ ఓ రేంజిలో పేలుతుంది. ఇవే మనమంతా ఇప్పటిదాకా జగన్ లో చూసిన ప్రత్యేక అంశాలు. అదేంటో గానీ… బుధవారం విశాఖ పర్యటనలో జగన్ లో ఆ ఫైర్ అంతగా కనిపించలేదని చెప్పాలి. జగన్ గొంతు జీరబోయింది. వాయిస్ లో బేస్ కనిపించలేదు. వెరసి జగన్ స్పీచ్ అంతగా ఆకట్టుకోలేదనే చెప్పక తప్పదు.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంబింవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోగా… బాదిత కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ బుధవారం విశాఖకు వెళ్లారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్.. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ వాయిస్ అంత గట్టిగా కనిపించలేదు. ఒకానొక సమయంలో ఆయన నోట నుంచి పదాలు చాలా లో వాయిస్ లో వినిపించాయి.

వైసీపీ హయంలో ఎల్జీ పాలిమర్స్ నుంచి విష వాయువులు వెలువడి 14 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చిందన్న విషయాన్ని ప్రస్తావించిన సందర్భంగా జగన్ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎల్జీ పాలిమర్స్ అన్న పేరే గుర్తుకు రానట్టుంది. దీంతో తన వెనుకే ఉన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను అడిగి మరీ ఆ కంపెనీ పేరును గుర్తు చేసిన జగన్… నాడు చనిపోయిన వారి కుటుంబాలకు తాము రూ.1 కోటి పరిహారాన్ని ఇచ్చామని గుర్తు చేశారు.

జగన్ ఎల్జీ పాలిమర్స్ పేరు ప్రస్తావిస్తున్నప్పుడే ఆయన గొంతు జీరబోయింది. ఉన్నట్లుండి జగన్ వాయిస్ జీరో బేస్ చేరడంతో అక్కడున్న వారంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం కనిపించింది. అయితే వాయిస్ బేస్ లెస్ గా మారినా కూడా జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే కాసేపటికి ఆయన గొంతు కాస్తంత గట్టిగా వినిపించినా…మరింత సేపు మాట్లాడేందుకు ఇబ్బంది పడ్డ జగన్… తన ప్రసంగాన్ని అనుకున్న సమయానికంటే ముందుగానే ముగించారు.