ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో వైసీపీ పాత్ర ఉందని ఇప్పటికే అధికార టీడీపీ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ విగ్రహ ధ్వంసానికి పాల్పడ్డ జమ్ములయ్య అనే వ్యక్తి వైసీపీ కార్యకర్తేనని పోలీసులు కూడా నిర్ధారించిన తీరుతో వైసీపీ పరిస్థితి మరింతగా దిగజారిందని చెప్పాలి. ఇలాంటి సమయంలో టీడీపీ సీనియర్ నేత, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వైసీపీపైనా, ఆ పార్టీ అదినేత వైఎస్ జగన్ పైనా సంచలన ఆరోపణలు గుప్పించారు.
సోమవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా వైసీపీ తీరుపై మండిపడ్డ ఆంజనేయులు… రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నెలకొనేలా వైసీపీనే వైఎస్ విగ్రహ ధ్వంసానికి పాల్పడిందని ఆరోపించారు. వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జమ్ములయ్య… వైసీపీకి చెందిన వాడేనని ఏకంగా పోలీసులే నిర్ధారించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఏపీని రావణ కాష్టంగా మార్చే దిశగానే వైసీపీ ఈ దుర్మార్గానికి పాల్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఈ తరహా రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ఆరోపించారు.
ఇక మొన్నటి ఎన్నికల్లో వినుకొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నెరపిన అవినీతి అక్రమాలపైనా ఆంజనేయులు ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో నకిలీ పత్రాలతో పాటు నకిలీ జీవోలను సృష్టించి మరీ బ్రహ్మనాయుడు వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను దోచేశారన్నారు. ఈ వ్యవహారంలో బ్రహ్మనాయుడుతో పాటుగా ఇతర వైసీపీ నేతలకు హస్తముందని ఆయన ఆరోపించారు. ఇక బ్రాహ్మణపల్లిలో బ్రహ్మనాయుడు పాల్పడ్డ భూకుంభకోణంలో వైసీపీ అదినేత వైఎస్ జగన్ కూ హస్తం ఉందని కూడా ఆయన ఆరోపించారు. ఈ భూదందాలో జగన్ ఏ మేర వాటా తీసుకున్నారన్న విషయాన్ని వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
This post was last modified on June 1, 2026 7:57 pm
గత నెల మధ్యలో ‘ది ఒడిస్సీ’ సినిమా రిలీజ్ టైంలో ఎంత హడావుడి నెలకొందో చూశాం. ప్రస్తుతం వరల్డ్ సినిమా…
లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో…
బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీ ప్రజలకు బాగా గుర్తున్న పేరు. వైసీపీ అధికారంలో ఉండగా... జగన్ ఆదేశిస్తే టీడీపీ అదినేత, ఏపీ…
డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…