Political News

విగ్రహాల ధ్వంసం… జగన్ పై జీవి ఆంజనేయులు ఆరోపణలు

ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో వైసీపీ పాత్ర ఉందని ఇప్పటికే అధికార టీడీపీ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ విగ్రహ ధ్వంసానికి పాల్పడ్డ జమ్ములయ్య అనే వ్యక్తి వైసీపీ కార్యకర్తేనని పోలీసులు కూడా నిర్ధారించిన తీరుతో వైసీపీ పరిస్థితి మరింతగా దిగజారిందని చెప్పాలి. ఇలాంటి సమయంలో టీడీపీ సీనియర్ నేత, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వైసీపీపైనా, ఆ పార్టీ అదినేత వైఎస్ జగన్ పైనా సంచలన ఆరోపణలు గుప్పించారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా వైసీపీ తీరుపై మండిపడ్డ ఆంజనేయులు… రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నెలకొనేలా వైసీపీనే వైఎస్ విగ్రహ ధ్వంసానికి పాల్పడిందని ఆరోపించారు. వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జమ్ములయ్య… వైసీపీకి చెందిన వాడేనని ఏకంగా పోలీసులే నిర్ధారించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఏపీని రావణ కాష్టంగా మార్చే దిశగానే వైసీపీ ఈ దుర్మార్గానికి పాల్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఈ తరహా రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ఆరోపించారు.

ఇక మొన్నటి ఎన్నికల్లో వినుకొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నెరపిన అవినీతి అక్రమాలపైనా ఆంజనేయులు ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో నకిలీ పత్రాలతో పాటు నకిలీ జీవోలను సృష్టించి మరీ బ్రహ్మనాయుడు వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను దోచేశారన్నారు. ఈ వ్యవహారంలో బ్రహ్మనాయుడుతో పాటుగా ఇతర వైసీపీ నేతలకు హస్తముందని ఆయన ఆరోపించారు. ఇక బ్రాహ్మణపల్లిలో బ్రహ్మనాయుడు పాల్పడ్డ భూకుంభకోణంలో వైసీపీ అదినేత వైఎస్ జగన్ కూ హస్తం ఉందని కూడా ఆయన ఆరోపించారు. ఈ భూదందాలో జగన్ ఏ మేర వాటా తీసుకున్నారన్న విషయాన్ని వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. 

This post was last modified on June 1, 2026 7:57 pm

Share

Recent Posts

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

39 minutes ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

4 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

6 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

7 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

7 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

8 hours ago