Political News

విగ్రహాల ధ్వంసం… జగన్ పై జీవి ఆంజనేయులు ఆరోపణలు

ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో వైసీపీ పాత్ర ఉందని ఇప్పటికే అధికార టీడీపీ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ విగ్రహ ధ్వంసానికి పాల్పడ్డ జమ్ములయ్య అనే వ్యక్తి వైసీపీ కార్యకర్తేనని పోలీసులు కూడా నిర్ధారించిన తీరుతో వైసీపీ పరిస్థితి మరింతగా దిగజారిందని చెప్పాలి. ఇలాంటి సమయంలో టీడీపీ సీనియర్ నేత, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వైసీపీపైనా, ఆ పార్టీ అదినేత వైఎస్ జగన్ పైనా సంచలన ఆరోపణలు గుప్పించారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా వైసీపీ తీరుపై మండిపడ్డ ఆంజనేయులు… రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నెలకొనేలా వైసీపీనే వైఎస్ విగ్రహ ధ్వంసానికి పాల్పడిందని ఆరోపించారు. వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జమ్ములయ్య… వైసీపీకి చెందిన వాడేనని ఏకంగా పోలీసులే నిర్ధారించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఏపీని రావణ కాష్టంగా మార్చే దిశగానే వైసీపీ ఈ దుర్మార్గానికి పాల్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఈ తరహా రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ఆరోపించారు.

ఇక మొన్నటి ఎన్నికల్లో వినుకొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నెరపిన అవినీతి అక్రమాలపైనా ఆంజనేయులు ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో నకిలీ పత్రాలతో పాటు నకిలీ జీవోలను సృష్టించి మరీ బ్రహ్మనాయుడు వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను దోచేశారన్నారు. ఈ వ్యవహారంలో బ్రహ్మనాయుడుతో పాటుగా ఇతర వైసీపీ నేతలకు హస్తముందని ఆయన ఆరోపించారు. ఇక బ్రాహ్మణపల్లిలో బ్రహ్మనాయుడు పాల్పడ్డ భూకుంభకోణంలో వైసీపీ అదినేత వైఎస్ జగన్ కూ హస్తం ఉందని కూడా ఆయన ఆరోపించారు. ఈ భూదందాలో జగన్ ఏ మేర వాటా తీసుకున్నారన్న విషయాన్ని వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. 

Kumar

Recent Posts

బాల‌కృష్ణ కూతురు మ‌ళ్లీ చిత‌గ్గొట్టేసింది

సెల‌బ్రెటీల కుటుంబాల్లో కొంద‌రిలో ఎంతో ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ.. అది ఎప్పుడో కానీ బ‌య‌టికి రాదు. ఎప్పుడూ మామూలుగా క‌నిపించే వ్య‌క్తులు..…

4 hours ago

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

5 hours ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

7 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

7 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

7 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

7 hours ago