ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో వైసీపీ పాత్ర ఉందని ఇప్పటికే అధికార టీడీపీ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ విగ్రహ ధ్వంసానికి పాల్పడ్డ జమ్ములయ్య అనే వ్యక్తి వైసీపీ కార్యకర్తేనని పోలీసులు కూడా నిర్ధారించిన తీరుతో వైసీపీ పరిస్థితి మరింతగా దిగజారిందని చెప్పాలి. ఇలాంటి సమయంలో టీడీపీ సీనియర్ నేత, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వైసీపీపైనా, ఆ పార్టీ అదినేత వైఎస్ జగన్ పైనా సంచలన ఆరోపణలు గుప్పించారు.
సోమవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా వైసీపీ తీరుపై మండిపడ్డ ఆంజనేయులు… రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నెలకొనేలా వైసీపీనే వైఎస్ విగ్రహ ధ్వంసానికి పాల్పడిందని ఆరోపించారు. వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జమ్ములయ్య… వైసీపీకి చెందిన వాడేనని ఏకంగా పోలీసులే నిర్ధారించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఏపీని రావణ కాష్టంగా మార్చే దిశగానే వైసీపీ ఈ దుర్మార్గానికి పాల్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఈ తరహా రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ఆరోపించారు.
ఇక మొన్నటి ఎన్నికల్లో వినుకొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నెరపిన అవినీతి అక్రమాలపైనా ఆంజనేయులు ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో నకిలీ పత్రాలతో పాటు నకిలీ జీవోలను సృష్టించి మరీ బ్రహ్మనాయుడు వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను దోచేశారన్నారు. ఈ వ్యవహారంలో బ్రహ్మనాయుడుతో పాటుగా ఇతర వైసీపీ నేతలకు హస్తముందని ఆయన ఆరోపించారు. ఇక బ్రాహ్మణపల్లిలో బ్రహ్మనాయుడు పాల్పడ్డ భూకుంభకోణంలో వైసీపీ అదినేత వైఎస్ జగన్ కూ హస్తం ఉందని కూడా ఆయన ఆరోపించారు. ఈ భూదందాలో జగన్ ఏ మేర వాటా తీసుకున్నారన్న విషయాన్ని వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…
తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా…