ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న పవన్ కు చుక్కెదురైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు హైదరాబాద్ లో పవన్ చేపట్టదలిచిన సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంతోపాటు శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ సభకు అనుమతినివ్వలేమని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే సభకు అనుమతినివ్వాలని కోరుతూ జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో, కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.
‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం’ సభను జనసేన తలపెట్టిన సంగతి తెలిసిందే. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సభను అట్టహాసంగా నిర్వహించాలని జనసేన నేతలు భావించారు.
తెలంగాణలో యువత లక్ష్యంగా జనసేనను బలోపేతం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ కార్యక్రమాన్ని పవన్ తలపెట్టారు. తెలంగాణ నలుమూలలా గర్జించేందుకు జనసేనను సన్నద్ధం చేయడమే టార్గెట్ గా ఈ సభను నిర్వహించాలని భావించారు.
తెలంగాణలో పార్టీని గ్రామ స్థాయి నుంచి విస్తరించడం, భవిష్యత్ కార్యచరణ, పొలిటికల్ యాక్షన్ ప్లాన్ను ఈ సమావేశం ద్వారా పవన్ ప్రకటించాలని భావించారు. తెలంగాణవ్యాప్తంగా ఉన్న జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ సభకు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…