మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి రాజకీయాల్లోకి దూకేశారు. తమిళ వెట్రిగ కజగం (టీవీకే) పేరిట పార్టీని పెట్టిన ఆయన ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు విక్టరీ సాదించారు. ఏ ఒక్కరి అంచనాలకు అందని రీతిలో ఆయన ఏకంగా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయినా కూడా విజయ్ లో ఏమాత్రం తృప్తి లేదన్న మాట వినిపిస్తోంది. సోమవారం తనను ఎమ్మెల్యేగా గెలిపించిన తిరుచ్చి ఈష్ట్ ప్రజలను ఉద్దేశించి విజయ్ చేసిన ప్రసంగమే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి.
పెరంబూర్ తో పాటు తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విజయ్… రెండు చోట్లా విజయం సాధించారు. ఈ క్రమంలో పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగేందుకు సిద్ధపడ్డ విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో తనను ఎమ్మెల్యేగా గెలింపిచిన తిరుచ్చి ఈస్ట్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు విజయ్ సోమవారం తిరుచ్చి వెళ్లారు. ఈ సందర్భంగా తిరుచ్చి ప్రజలను ఉద్దేశించి విజయ్ భావోద్వేగ ప్రసంగం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడింది తిరుచ్చి ఈస్ట్ ప్రజల గురించే అయినా… మొత్తం రాష్ట్ర ప్రజలకు అన్వయించేలా విజయ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సారి అయినా తనకు సంపూర్ణ మెజారిటీ ఇవ్వాలని ఆయన తమిళ ఓటర్లను కోరారు. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే ఆవిర్భవించినా… రెండు ప్రధాన పార్టీలు తనను సీఎం కాకుండా అడ్డుపడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా ఇబ్బందులు లేకుండా వచ్చే సారి అయినా తనకు సంపూర్ణ మెజారిటీ ఇవ్వాలని ఆయన తమిళ ప్రజలను కోరారు.
విజయ్ నోట నుంచి ఈ మాట వచ్చినంతనే… సీఎం పదవి దక్కినా విజయ్ లో ఇంకా అసంతృప్తి ఛాయలే కనిపిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజమే మరి… ఎన్నికల్లో విజయ్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించినా.. ఆయన సీఎంగా పదవీ ప్రమాణం చేయడానికి ఏకంగా వారం రోజుల సమయం పట్టింది.
అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడింది కాబట్టి సరిపోయింది గానీ… లేదంటే విజయ్ సీఎంగా పదవీ ప్రమాణమే చేసే వారు కాదేమో. తనకు ఎదురైన అనుభవాలను నిత్యం గుర్తు చేసుకుంటూ సాగుతున్న విజయ్… తదుపరి ఎన్నికల్లో అయినా తనకు సంపూర్ణ మెజారిటీ కట్టబెట్టడం ద్వారా తనను అడ్డుకునే వారికి బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరినట్టైందని చెప్పాలి.
ఇక రాజకీయాలకే కొత్త కాకుండా సీఎం పదవికి కూడా తాను కొత్త అని వైరి వర్గాలు ఆరోపిస్తున్న విషయాన్ని కూడా విజయ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తనకు ఓ 6 నెలల సమయం ఇచ్చి చూద్దామని చాలా పార్టీల నేతలు బహిరంగంగా ప్రకటించారని విజయ్ గుర్తు చేశారు. 6 నెలలు కాదు కదా… కనీసం ఆరు రోజులు కూడా వేచి చూడకుండానే తన పాలనపై ఆయా పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రభుత్వం మంచి మాత్రమే చేస్తుందని, తనను గెలిపించిన ప్రజలకు తాను ఇదే మాటను అమలు చేసి చూపిస్తానని విజయ్ అన్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…