Political News

క‌డ‌ప‌పైనే పసుపు సేన దృష్టి

రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున హాజరయ్యారు. మై టిడిపి యాప్ ద్వారా ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అన్న విషయాలను తెలుసుకున్నారు. హాజరు కూడా తీసుకున్నారు. ఇట్లా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ క్లస్టర్ల వారిగా నిర్వహించిన ఈ కార్యక్రమం భారీ స్థాయిలో విజయవంతం అయింది. అయితే మహానాడును నిర్వహించిన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆసక్తికర చర్చ నడిచింది.

ఎక్కువమంది నాయకులు ఒకే జిల్లాపై దృష్టి పెట్టారు. అదే కడప. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కావడంతో పాటు ఈ జిల్లాలో ఇటీవల కాలంలో టిడిపి నేతలు మధ్య వివాదాలు తెరమీదకు వచ్చిన పరిస్థితి కనిపించింది. పైగా కొంతమంది సీనియర్ నాయకులను ఇటీవలే పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు కూడా. కలివిడిగా లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని కడప జిల్లాను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నామని కూడా ఆయన వెల్లడించారు. పెట్టుబడుల విషయంలోనూ సంక్షేమ విషయంలోనూ కడప జిల్లాకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు.

ఈ క్రమంలో అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీ కార్యక్రమాలను అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కూడా దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పులివెందుల, కడప, రాజంపేట, జమ్మలమడుగు, మైదుకూరు ఇలా కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ అంతర్గతంగా నాయకుల మధ్య మాట పట్టింపులు ఆధిప‌త్య‌ పోరు, వ్యాపార వ్యవహారాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కడప జిల్లాలో మహానాడు ఏ విధంగా నిర్వహిస్తారు.. అనేది పార్టీలో ఆసక్తిగా మారింది. దీంతో జిల్లాలో నిర్వహించిన మహానాడును ఆన్లైన్ వేదికగా తెరమీద ప్రత్యేకంగా ప్రదర్శించారు. దీనికోసం ఒక ఎల్ఈడి స్క్రీన్ ను ఏర్పాటు చేసి.. పైన బోర్డును కూడా పెట్టడం విశేషం. దీనిని బట్టి కడప జిల్లాకు ఇస్తున్న ప్రాధాన్యం, కడపలో నాయకులు ఏ విధంగా మహానాడు నిర్వహించారనే అంశంపై పార్టీ అధిష్టానం చూపిన శ్రద్ధ వంటివి స్పష్టమయ్యాయి.

దీనికి తోడు మంగళగిరి వేదికగా జరిగిన మహానాడుకు వచ్చిన ప్రతి ఒక్కరు కడప జిల్లాలో ఏం జరుగుతుందని ఆరా తీయడంతో పాటు అక్కడ మహానాడును నిర్వహించే నాయకులతో తరచుగా సంభాషించటం, తెరమీద వీక్షించడం వంటివి కనిపించాయి. అయితే ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ మహానాడును ఘనంగానే నిర్వహించారు. ఒక్క నియోజకవర్గంలో తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ మహానాడు కార్యక్రమం వైభవంగానే సాగింది. దీంతో నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే ఒక నియోజకవర్గంలో సరిగా నిర్వహించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం అయింది. ఇక్కడ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న నాయకుడిపై ఇటీవల విమర్శలు రావడం, వివాదంలో చిక్కుకోవడంతో మహానాడును సరిగా నిర్వహించలేకపోయారు అన్న వాదన వినిపించింది. ఏది ఏమైనప్పటికీ వైసీపీ అధినేత సొంత జిల్లాలో మహానాడు బాగానే జరగడం కార్యకర్తలను భారీ సంఖ్యలో తరలించడం వంటివి సీనియర్ నాయకులతో పాటు పార్టీకి కూడా సంతృప్తిని కలిగించింది.

Kumar

Recent Posts

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

52 minutes ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

2 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

4 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

4 hours ago

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…

5 hours ago

జాన్వీ కపూర్ దురదృష్టం అలా ఉంది

పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…

5 hours ago