కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్ త్వరలో విడుదలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. సెన్సార్ సర్టిఫికెట్ రాగానే జూన్ 19 డేట్ వేసేందుకు నిర్మాత సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే తమిళ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర సమాచారం ఉంది. అయితే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చే దాకా ఏదీ ఖరారుగా చెప్పలేరు కాబట్టి దాని కోసం ఎదురు చూస్తున్నారు.
విజయ్ వారసుడు జేసన్ సంజయ్ తొలిసారి దర్శకత్వం వహించిన సిగ్మా జూలై 31 థియేటర్లలో అడుగు పెట్టనుంది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ఇందులో జంటగా నటించారు. ఇక్కడ విశేషం ఏంటంటే విజయ్ సిఎం ప్రమాణ స్వీకారానికి భార్య పిల్లలు రాలేదు. జేసన్ కూడా కనిపించలేదు. దీని గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. విభేదాలతో పాటు త్రిష గురించి జరుగుతున్న ప్రచారం వల్లే దూరంగా ఉన్నారని మాట్లాడుకున్నారు.
ఇప్పుడు సిగ్మా టైంలో విజయ్ ఫ్యాన్స్ జేసన్ కు మద్దతుగా ఉంటారా లేదానేది వేచి చూడాలి. నిజానికి తనను స్క్రీన్ మీద జూనియర్ విజయ్ గా చూడాలని వాళ్ళు కోరుకున్నారు. దానికి భిన్నంగా అతను డైరెక్షన్ ఎంచుకున్నాడు. ఒకవేళ మనసు మార్చుకుని తిరిగి యాక్టింగ్ అంటాడేమో చూడాలి. సిగ్మాని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. తమన్ సంగీతం సమకూర్చారు. వచ్చే నెల నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేయబోతున్నారు.
కాకపోతే జేసన్ కు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అయితే వస్తుంది. ప్రమోషన్స్ కు వెళ్ళినప్పుడు విజయ్ ప్రస్తావన లేకుండా మీడియా ప్రశ్నలు అడగదు. దాన్ని తప్పించుకోవడం అంత సులభం కాదు. అందులోనూ విడాకుల కేసు ఇంకా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఇతను ఏమన్నా అదో పెద్ద డిబేట్ అయిపోతుంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైతేనేం తక్కువ గ్యాప్ లో తండ్రి కొడుకుల సినిమాలు మూవీ లవర్స్ మధ్య ఇంటరెస్టింగ్ టాపిక్స్ గా మారబోతున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రస్తుత మంత్రి కొండా సురేఖ, ఇదే జిల్లాకు చెందిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ…
సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆసక్తికర పోస్టు చేశా రు. చంద్రబాబుగారూ.. అని…
హస్తకళా మహోత్సవం వేదికపై కళాకారులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను స్వయంగా విన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరుసటి రోజే…
జూలై 10 విడుదల కాబోతున్న సినిమాల్లో ప్రస్తుతానికి హృదయం మురళి తక్కువ సౌండ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ దీని వెనుక…
ఆంధ్రప్రదేశ్కు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా…
యాంకర్గా ప్రయాణం మొదలుపెట్టి నటిగా మంచి స్థాయికి చేరుకున్న తెలుగమ్మాయి స్వాతి మళ్లీ పెళ్లికూతురైంది. తొలి వివాహం విఫలమయ్యాక కొన్నేళ్లు…