లోకేశ్ బిగ్ అనౌన్స్ మెంట్ ఇదే

ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నాను అంటూ టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ చెప్పిన సంగతి తెలిసిందే. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగుతున్న తొలి మహానాడు సందర్భంగా లోకేశ్ చేయబోతున్న ఆ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.

ఈ క్రమంలోనే తన తాత ఎన్టీఆర్, తండ్రి సీబీఎన్ బాటలోనే మహిళలకు పెద్దపీట వేసేలాగా లోకేశ్ ఆ ప్రకటన చేశారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాకపోయినా టీడీపీ మహిళలకు కనీసం 33% సీట్లు రిజర్వ్ చేయాలని తాను ప్రతిపాదిస్తున్నానని అన్నారు. మహిళలకు 33 శాతం సీట్లు టీడీపీ కేటాయించాలని ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నానని తెలిపారు.

పార్లమెంటులో ఇటీవల మహిళల రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టారని, ఆ బిల్లులకు ఎన్డీఏ మిత్రపక్షాలలో ఒకటిగా టీడీపీ మద్దతిచ్చిందని లోకేశ్ గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పార్టీలు ఆ బిల్లులను అడ్డుకున్నాయని అన్నారు.

అందుకే, మరోసారి బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. అయితే, అక్కడ బిల్లు పాస్ అయినా కాకున్నా…ఏపీలో మాత్రం టీడీపీ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలని తాను ప్రతిపాదిస్తున్నానని అన్నారు.