దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. తాజాగా రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా 24 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఏపీకి సంబంధించి 4 స్థానాలు ఉండడం గమనార్హం. ఈ ఎన్నికలు మొత్తం 10 రాష్ట్రాల్లో జరగనున్నాయి. అయితే.. కొన్ని స్థానాలు జూన్లోను, మరికొన్ని స్థానాలు జూలైలోనూ ఖాళీ కానున్నాయి.
ఈ నేపథ్యంలో రెండు నెలల్లోనూ ఖాళీ అయ్యే స్థానాలకు సంబంధించి ఎన్నికల సంఘం ఒకే సారి నోటిఫికేషన్ను జారీ చేసింది. దీని ప్రకారం.. జూన్, జూలైలో ఖాళీ అయ్యే స్థానాలకు.. జూన్ 1 నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. జూన్ 8వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు సమయం ఉంటుంది.
అనంతరం.. జూన్ 9న నామినేషన్లను పరిశీలిస్తారు. ఇక, నామినేషన్లు దాఖలు చేసిన వారు ఉపసంహరించుకునేందుకు అదే జూన్ 11వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. జూన్ 18వ తేదీన ఒకే రోజు 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుపుతారు. ఈ ప్రక్రియ మొత్తం జూన్ 20వ తేదీ కల్లా.. ముగియనుందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
తాజా ఎన్నికల్లో ఏపీలోని నాలుగు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ల పదవీ కాలం జూన్ 21న ముగియనుంది. దీంతో ఏపీలో ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నాలుగు స్థానాలు కూడా అధికార కూటమి పార్టీలకే దక్కనున్నాయి.
This post was last modified on May 22, 2026 2:32 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చాలా కాలం తర్వాత డబ్బింగ్ సినిమాల డామినేషన్ కనిపిస్తోంది. గత వారం విడుదలైన వీరభద్రుడు వీక్…
అదేంటో గానీ… సీనియర్ రాజకీయవేత్త, టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ఏ పని చేసినా…
కల్కి, సలార్ లాంటి భారీ విజయాలు ఖాతాలో ఉన్నా కూడా, ప్రభాస్ వాటి సీక్వెల్స్ ను హోల్డ్ లో పెట్టి…
ప్రశాంత్ నీల్ అనగానే భారీ బ్లాస్ట్ లు, తుపాకుల మోతలు, డార్క్ బ్యాక్ డ్రాప్ లో సాగే రక్తపాతం గుర్తొస్తాయి.…
విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి కలయికల్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబంలో మెయిన్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి అన్న…
నిజమే… ఒక్క యువతిని ఇద్దరు స్నేహితులు ప్రేమించిన వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారి… గురువారం రాత్రి బెజవాడ…