Political News

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. వేట నిషేధ స‌మ‌యంలో మ‌త్స్య‌కార కుటుంబాల‌కు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఏటా ప్ర‌భుత్వం ఇస్తున్న రూ.20 వేల న‌గ‌దును వారి వారి ఖాతాల్లో జ‌మ చేశారు.

అనంత‌రం.. స‌భ‌లో మాట్లాడారు. అక్క‌డితో చంద్ర‌బాబు నెల్లూరు షెడ్యూల్ ముగిసింది. అనంత‌రం ఆయ‌న కుప్పం వెళ్లాలి. కానీ, మ‌త్స్య‌కారుల ఆహ్వానం మేర‌కు.. ఆయ‌న కుప్పం షెడ్యూల్‌ను సైతం క్యాన్సిల్ చేసుకుని.. స్థానికంగా ఉన్న మార్కెట్‌ను ప‌రిశీలించేందుకు వెళ్లారు.

మార్కెట్‌లో క‌లియ‌దిరిగి ప‌రిశీలించిన చంద్ర‌బాబు.. మ‌హిళా వ్యాపారుల‌ను ప‌ల‌క‌రించారు. అదేస‌మ‌యంలో పుష్టిగా ఉన్న చేప‌లు మార్కెట్‌కు వ‌చ్చాయి. దీంతో వాటిపై మ‌న‌సు ప‌డ్డ చంద్ర‌బాబు.. ఓ మ‌హిళా వ్యాపారి వ‌ద్ద‌కు వెళ్లి కేజీ చేప‌లు కొనుగోలు చేశారు.

దానికి సంబంధించిన న‌గ‌దు కూడా ఇచ్చారు. అనంత‌రం.. త‌న‌తోపాటే మార్కెట్ వ‌చ్చిన బాబు అనే మ‌త్స్య‌కారుడికి వాటిని ఇచ్చి.. పులుసు పెట్ట‌డం వ‌చ్చా? అని ప్ర‌శ్నించారు. త‌న‌కంటే కూడా.. త‌న భార్య బాగా పెడుతుంద‌ని.. ఇంటికి రావాల‌ని ఆయ‌న కోర‌డంతో చంద్ర‌బాబు అక్క‌డి నుంచి వారి ఇంటికి వెళ్లారు.

స్వ‌యంగా మ‌త్స్య‌కారుడు బాబు స‌తీమ‌ణికి చేప‌లు ఇచ్చిన సీఎం.. వాటితో పులుసు పెట్టాల‌ని కోరారు. ఆమె సంతోషంగా పులుసుపెట్టింది. ఈ స‌మ‌యంలో మ‌ధ్య మ‌ధ్య చంద్ర‌బాబుకూడా గ‌రిటె తిప్పారు. అనంత‌రం.. వారి యోగ‌క్షేమాలు తెలుసుకున్నారు.

పులుసు వుడ‌క‌డం పూర్త‌య్యాక‌.. స్వ‌యంగా వారితో క‌లిసి భోజ‌నం చేశారు. అప్ప‌టికి సాయంత్రం 5 గంట‌లు అవుతుంది. చంద్ర‌బాబు స్వ‌యంగా త‌న చేత్తోనే పులుసు, చేప ముక్క‌ల‌ను మ‌త్స్య‌కారుడు బాబుకు, వారి కుటుంబ స‌భ్యుల‌కు వ‌డ్డించి.. వారిచ్చిన ప‌ళ్లెంలోనే తాను కూడా భోజ‌నం చేశారు. ఈ ఘ‌ట‌నతో మ‌త్స్య‌కారులు ఫిదా అయ్యారు.

కాగా.. త‌ర‌చుగా ప్ర‌తి నెలా 1న పింఛ‌ను పంపిణీ చేసేందుకు వెళ్లేచంద్ర‌బాబు ల‌బ్ధి దారుల నివాసాల‌ను సంద‌ర్శించ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో వారి ఇళ్ల టీ కాయ‌డం.. తాను తీసుకుని.. కుటుంబ స‌భ్యుల‌కు కూడా ఇవ్వ‌డం తెలిసిందే. కానీ, తొలిసారి చంద్ర‌బాబు చేప‌ల పులుసు వండ‌డం.. త‌నే స్వ‌యంగా మ‌త్స్య‌కారుల‌కు వ‌డ్డింది.. తాను కూడా ఆరగించ‌డం ఇదే తొలిసారి కావ‌డంతో మ‌త్స్య‌కారులు ఫిదా అయ్యారు.

కాగా.. మ‌త్స్య‌కారులతో ప‌ర్య‌ట‌న ఆల‌స్యం కావ‌డంతో చంద్ర‌బాబు త‌న కుప్పం ప‌ర్య‌ట‌న‌ను మానుకున్నారు. కాగా.. బుధ‌వారం చంద్ర‌బాబు బెంగ‌ళూరుకు వెళ్లి.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంత‌ర్జాతీయ కేంద్రంలో నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

This post was last modified on May 19, 2026 9:45 pm

Share

Recent Posts

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

6 hours ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

6 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

6 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

7 hours ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

9 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

10 hours ago