Political News

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను అదేవిధంగా నకిలీ మద్యం కేసులోను ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొన్నాళ్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు. అదే సమయంలో ఆయన పై చంద్రబాబు నివాసం పై జరిగిన దాడి కేసు కూడా వెంటాడుతోంది. మరోవైపు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ జోగి మధ్య కూడా అనేక వివాదాలు ఉన్నాయి. పలు కేసులు కూడా నమోదయి కొనసాగుతున్నాయి.

అయినప్పటికీ జోగి రమేష్ ఎక్కడ వెనక్కి తగ్గకపోగా తన ధోరణిని ఆయన కొనసాగిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మామిళ్ళపల్లిలో రైతులను పరామర్శించేందుకు వెళ్లిన ఆయన మరోసారి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రైతులను ఎలా అడ్డుకుంటారని, రైతులకు గోదాములను ఎలా మూసివేస్తారని ప్రశ్నించడంతోపాటు పోలీసులపై రివర్స్ ధోరణి ప్రదర్శించారు. దీంతో జోగి రమేష్ పై మరో కేసు నమోదు అయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

వాస్తవానికి జోగి రమేష్ గత ఎన్నికల సమయంలో ప‌రాజ‌యం పాలయ్యారు. ప్రస్తుతం మైలవరం నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించాలని చూస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిణామాలను చూస్తే ఆయనకి ఎక్కడా పాజిటివ్ రేటింగ్ అయితే రావడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి కూడా ఆయన అనుకూలంగా ఉన్నట్టు కనిపించడం లేదు. వాస్తవానికి ఎక్కడో గుంటూరు జిల్లాలో జరిగిన పరిణామాలతో ఆయన స్పందించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ తనను తాను అతిగా ఊహించుకుంటున్నారనే వాద‌న వినిపిస్తోంది.

లేకపోతే పార్టీ తరఫున రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగాలని భావిస్తున్నాడో తెలియదు. కానీ, ప్రస్తుతం జోగి రమేష్ వ్యవహారం వైసీపీలో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఆయన దూకుడు తగ్గించుకుంటారా లేకపోతే అట్లాగే కొనసాగుతారా అనేది పార్టీలోనూ చర్చగా మారింది. ఏది ఏమైనప్పటికీ జోగి రమేష్ పై ఇప్పటికే పలు కేసులు నమోదయి ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి మరిన్ని కేసులు నమోదైతే తనకు సింఫతీ పెరుగుతుందని భావిస్తున్నారేమో అనే చర్చ కూడా నడుస్తుండడం గమనార్హం.

This post was last modified on May 19, 2026 5:19 pm

Share
Show comments
Published by
Kumar
Tags: jogi ramesh

Recent Posts

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

33 minutes ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

1 hour ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

2 hours ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

2 hours ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

2 hours ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

5 hours ago