Political News

పిఠాపురం విద్యార్థులకు పవన్ వరం

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నిర్ణ‌యంతో నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల పంట పండి న‌ట్టు అయింది.

ఇటీవ‌ల విడుదైల‌న ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో ప్ర‌భుత్వ పాఠ‌శాలల‌కు చెందిన విద్యార్థులు ప‌లువురు టాప్ మార్కులు సంపాయించుకున్నారు. వీరి విష‌యాన్ని అధికారులు ప‌వ‌న్ దృష్టికి తీసుకువెళ్లారు. వీరంతా పేద కుటుంబాల నుంచి వ‌చ్చిన వారేన‌ని.. చాలా క‌ష్ట‌ప‌డి చ‌దువుకున్నార‌ని వివ‌రించారు.

దీంతో ఆయా విద్యార్థుల ఉన్న‌త చ‌దువుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా భ‌రోసా క‌ల్పించారు. ఇక నుంచి వారి చ‌ద‌వులకు అయ్యే వ్య‌యం.. దుస్తులు, పుస్త‌కాలు ఇలా అన్నీ తానే పెట్టుకుంటాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తేల్చి చెప్పారు. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 31 మంది విద్యార్థులు 600 మార్కుల‌కు గాను.. 580 మార్కులు సంపాయించుకున్నారు.

ఇప్పుడు వీరి ఉన్న‌త చ‌దువుల బాధ్య‌త‌ల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ తీసుకుంటారు. వారికి ఇష్ట‌మైన కోర్సుల్లో చేర్పించ‌డంతోపాటు..చ‌దువు పూర్త‌య్యే వ‌ర‌కు అయ్యే ఖ‌ర్చును కూడా ఆయ‌నే పెట్టుకుంటారు. ఇదంతా వ్య‌క్తిగ‌త సొమ్ము నుంచి ఖ‌ర్చుచేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్న‌ట్టు అధికారులు తెలిపారు.

పిఠాపురానికి చెందిన 31 మంది విద్యార్థులలో కొంద‌రు.. 598 మార్క‌లు కూడా సంపాయించుకున్నారు. వీరి స్టేట్ టాప‌ర్లుగా నిలిచారు. మిగిలిన వారు 580 మార్కులు తెచ్చుకున్నారు. దీంతో వీరి చ‌దువులు కేవ‌లం సొమ్ము లేద‌న్న‌కార‌ణంగానో.. కుటుంబాల నేప‌థ్యం స‌రిగా లేద‌న్న కార‌ణంతోనో నిలిచిపోకూడ‌ద‌న్న ఉద్దేశంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. వారికి కోరుకున్న కాలేజీలో సీట్లు ఇప్పించ‌డ‌మే కాకుండా.. పుస్త‌కాలు.. ర‌వాణా వ్య‌యానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు కూడా చేశారు. దీంతో ఆయా కుటుంబాలు సంతోషం వ్య‌క్తం చేస్తున్నాయి.

అనాథ‌లు..

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌ల్లీదండ్రుల‌ను కోల్పోయిన అనాథ బాల‌బాలిక‌ల‌ను కూడా ప‌వ‌న్ ఆద‌రిస్తున్న విష‌యం తెలిసిందే. వారికి నెల నెలా త‌న ఎమ్మెల్యే వేత‌నం నుంచి 5 వేల రూపాయ‌ల చొప్పున కేటాయిస్తున్నారు. వీరిలో ఏడుగురు ఇప్పుడు ప‌దోత‌ర‌గ‌తిలో టాప‌ర్లుగా నిలిచారు. ఈ విష‌యంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ సంతోషం వ్య‌క్తం చేశారు. వారిని కూడా ఉన్న‌త విద్య‌కు ప్రోత్స‌హించాల‌ని అధికాల‌కు సూచించారు. పిఠాపురం విద్యార్థులు ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు పొందాల‌ని ఆకాంక్షించారు.

This post was last modified on May 14, 2026 2:06 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

5 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

8 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

9 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

9 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

9 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

10 hours ago