టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోల్లో ఒకడైన రామ్.. ఒకప్పుడు నిలకడగా విజయాలు అందుకునేవాడు. కానీ కొన్నేళ్లుగా అతడికి అస్సలు కలిసి రావడం లేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత వరుసగా పరాజయాలు అందుకున్నాడు. గత ఏడాది వచ్చిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా విషయంలో రామ్ ఎంత తపన పడ్డాడో తెలిసిందే. తన మాస్ ఇమేజ్ అంతా పక్కన పెట్టి ఒక స్టార్ హీరోను ఆరాధించే వీరాభిమాని పాత్రలో ఒదిగిపోయాడు.
ఈ సినిమా కోసం అతను సొంతంగా ఒక పాట కూడా రాశాడు. కొంత వరకు రైటింగ్లో కూడా ఇన్వాల్వ్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఐతే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ పాజిటివ్ రివ్యూలు, టాక్ తెచ్చుకుని కూడా సరిగా ఆడలేదు. తన ఖాతాలో మరో ఫ్లాప్ జమ కావడంతో రామ్ బాగా డిజప్పాయింట్ అయ్యాడు. అందుకే కొత్త సినిమా విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు.
వేరే వాళ్లు రాసిన కథలు తనకు మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోతున్న నేపథ్యంలో రామ్ ఈసారి తనే సొంతంగా కథ రాసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. దాన్ని డీల్ చేసే డైరెక్టర్ కోసం వెతుకుతున్నాడని.. డైరెక్షన్ కూడా తనే చేయాలనుకుంటున్నాడని.. ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి.ఐతే రామ్ కొత్త సినిమా విషయంలో ఇప్పటిదాకా క్లారిటీ రాలేదు. ఎట్టకేలకు రామ్ సస్పెన్సుకు తెరదించాలని నిర్ణయించుకున్నాడు.
శుక్రవారమే రామ్ కొత్త సినిమా గురించి అనౌన్స్మెంట్ రాబోతోంది. దానికి ముందు ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్తో రామ్ టీజ్ చేశాడు. అందులో ఒక వ్యక్తి చేతిలో మైక్ ఉంది. అది రక్తంతో తడిసి ఉంది. ఈ పోస్టర్ మీద దర్శక నిర్మాతల వివరాలేమీ లేవు. నేరుగా శుక్రవారం ఉదయమే అన్ని వివరాలు, విశేషాలు పంచుకోబోతున్నాడు. పోస్టర్ చూస్తే ఇది వయొలెంట్ సినిమా అనే సంకేతాలు కలుగుతున్నాయి.
కానీ కత్తితో పాటు రక్తం ఉంటే పక్కా వయొలెంట్ మూవీ అనుకోవచ్చు. కానీ హీరో చేతిలో ఉన్నది కావడంతో కాన్సెప్ట్ విషయంలో ట్విస్ట్ ఉంటుందేమో చూడాలి. ఐతే ఎలాంటి కథ ఎంచుకున్నప్పటికీ.. ఈసారి రామ్ హిట్టు కొట్టి తీరాల్సిందే. లేదంటే ఇప్పటికే బాగా డౌన్ అయిన మార్కెట్ మరింత కిందికి వెళ్లిపోవడం ఖాయం.
విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…
దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…
ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…
గొప్ప గొప్ప దర్శకులు కూడా తమ సినిమాలు ఆశించినంత ఆడకపోతే.. వాటి ఫలితాల విషయంలో చిత్రమైన కారణాలు చెబుతుంటారు. స్క్రిప్టు…
సుప్రీంకోర్టు హెచ్చరికలు, దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అందుతున్న వేలాది ఫిర్యాదులతో కేంద్ర ప్రభుత్వం కదిలింది. దేశంలో ఏదో ఒక రూపంలో…
వెనిజులాను వరుస భూకంపాలు వణికించాయి. దేశ రాజధాని కరాకస్తో పాటు ఉత్తర-మధ్య ప్రాంతాల్లో బుధవారం శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. తొలుత…