టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోల్లో ఒకడైన రామ్.. ఒకప్పుడు నిలకడగా విజయాలు అందుకునేవాడు. కానీ కొన్నేళ్లుగా అతడికి అస్సలు కలిసి రావడం లేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత వరుసగా పరాజయాలు అందుకున్నాడు. గత ఏడాది వచ్చిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా విషయంలో రామ్ ఎంత తపన పడ్డాడో తెలిసిందే. తన మాస్ ఇమేజ్ అంతా పక్కన పెట్టి ఒక స్టార్ హీరోను ఆరాధించే వీరాభిమాని పాత్రలో ఒదిగిపోయాడు.
ఈ సినిమా కోసం అతను సొంతంగా ఒక పాట కూడా రాశాడు. కొంత వరకు రైటింగ్లో కూడా ఇన్వాల్వ్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఐతే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ పాజిటివ్ రివ్యూలు, టాక్ తెచ్చుకుని కూడా సరిగా ఆడలేదు. తన ఖాతాలో మరో ఫ్లాప్ జమ కావడంతో రామ్ బాగా డిజప్పాయింట్ అయ్యాడు. అందుకే కొత్త సినిమా విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు.
వేరే వాళ్లు రాసిన కథలు తనకు మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోతున్న నేపథ్యంలో రామ్ ఈసారి తనే సొంతంగా కథ రాసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. దాన్ని డీల్ చేసే డైరెక్టర్ కోసం వెతుకుతున్నాడని.. డైరెక్షన్ కూడా తనే చేయాలనుకుంటున్నాడని.. ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి.ఐతే రామ్ కొత్త సినిమా విషయంలో ఇప్పటిదాకా క్లారిటీ రాలేదు. ఎట్టకేలకు రామ్ సస్పెన్సుకు తెరదించాలని నిర్ణయించుకున్నాడు.
శుక్రవారమే రామ్ కొత్త సినిమా గురించి అనౌన్స్మెంట్ రాబోతోంది. దానికి ముందు ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్తో రామ్ టీజ్ చేశాడు. అందులో ఒక వ్యక్తి చేతిలో మైక్ ఉంది. అది రక్తంతో తడిసి ఉంది. ఈ పోస్టర్ మీద దర్శక నిర్మాతల వివరాలేమీ లేవు. నేరుగా శుక్రవారం ఉదయమే అన్ని వివరాలు, విశేషాలు పంచుకోబోతున్నాడు. పోస్టర్ చూస్తే ఇది వయొలెంట్ సినిమా అనే సంకేతాలు కలుగుతున్నాయి.
కానీ కత్తితో పాటు రక్తం ఉంటే పక్కా వయొలెంట్ మూవీ అనుకోవచ్చు. కానీ హీరో చేతిలో ఉన్నది కావడంతో కాన్సెప్ట్ విషయంలో ట్విస్ట్ ఉంటుందేమో చూడాలి. ఐతే ఎలాంటి కథ ఎంచుకున్నప్పటికీ.. ఈసారి రామ్ హిట్టు కొట్టి తీరాల్సిందే. లేదంటే ఇప్పటికే బాగా డౌన్ అయిన మార్కెట్ మరింత కిందికి వెళ్లిపోవడం ఖాయం.
అనుకున్నట్టే ఫౌజీ విడుదల తేదీ డిసెంబర్ 3 లాకైపోయింది. ఇది రెండు వారాల క్రితమే లీకైన న్యూస్ అయినప్పటికీ ఫైనల్…
ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ కున్న క్రేజ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో లేదన్న మాటే కానీ పదిహేను సంవత్సరాల క్రితం ప్రసాద్ మల్టీప్లెక్స్…
భారతదేశానికి గర్వకారణమైన ఇస్రో లో ఇప్పుడు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా తమ ఉద్యోగాలకు…
క్రికెట్ ప్రపంచంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఐసీసీ 2027…
మన దేశం నుంచి ఎంతోమంది టాలెంటెడ్ యువత సరైన రూల్స్ పాటిస్తూ చదువు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్నారు. కానీ…
తెలుగులో మరే హీరోకూ లేని విచిత్రమైన ‘అయ్యగారు’ అనే బిరుదును అఖిల్ అక్కినేని సొంతం చేసుకున్నాడంటే.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన…