తమిళనాడులో రాజకీయాలు వేడి వేడిగా వున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష డీఎంకే తరచుగా ఏదో ఒక వివాదం రాజేసేందుకు ప్రయత్నిస్తుంది. అడ్డగోలు కామెంట్స్ చేసి రోడ్డు మీద పడుతుంది. నిజానికి విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు కూడా కాలేదు. ఈ ఏడాది మే 10 వ తేదీన చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి కనీసం ఒక ఏడాది పాటు విమర్శలు చేయకుండా ఒదిలి పెట్టడం ఒక ఆనవాయితీగా వస్తుంది. దీన్ని హనీమున్ పిరియడ్ గా అభివర్ణింస్తుంటారు. దీనికి భిన్నంగా ప్రతిపక్ష డీఎంకే తొలిరోజు నుంచే విజయ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి మొదట్నుంచి నోరు పారేసుకోవడం జరుగుతుంది. సనాతన ధర్మం గురించి ఆయన చేసిన, చేస్తున్న విమర్శల పట్ల ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుంది.
తాజాగా ముఖ్యమంత్రి విజయ్ స్నేహితురాలు, సినీ నటి త్రిష గురించి మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి చేసిన ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యమంత్రి వ్యక్తిగత విషయాల పట్ల విమర్శలు చేయడంతో టీవీకే పార్టీతో పాటుగా మిగిలిన పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసాయి. ఇక పార్టీ కార్యకర్తలు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. టీవీకే నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుతో చెన్నైలో ఉదయనిధిని అరెస్టు చేశారు. హై డ్రామా మధ్య సెంగిపట్టి పోలీసు స్టేషన్ కు తరలించారు. కొన్ని గంటల పాటు విచారించి పోలీసుల విచారణకు సహకరించాలని షరతుపెట్టి వదిలిపెట్టారు.
కుమారుడిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన మాజీ ముఖ్యమంత్రి స్థాలిన్ ముఖ్యమంత్రి విజయ్ ని ఒక డమ్మీ ముఖ్యమంత్రి అని విమర్శించారు. అంతటితో ఆగకుండా సీఎం విజయ్ రీల్ క్రియేటర్ గానే ఎక్కువగా గడుపుతున్నారని మండిపడ్డారు. ఉదయనిధి అరెస్టుతో తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎంకే కార్యకర్తలు పలుచోట్ల ఆందోళనకు దిగారు. రాజకీయ పార్టీలు సైతం రెండు గ్రూపులుగా విడిపోయాయి. ఒక వర్గం సీఎం విజయ్ కు మద్దతు పలకగా మరో వర్గం ఉదయనిధి అరెస్టును ఖండిస్తుంది.
This post was last modified on August 5, 2026 11:15 pm
నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా నిలవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…