నవశకం… విజయ్ అనే నేను!

తమిళనాడు రాజకీయాల్లో నవశకం మొదలైంది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. సీ.జోసెఫ్ విజయ్ అను నాను.. అంటూ విజయ్ చెప్పగానే స్టేడియం అంతా కేరింతలతో మార్మోగిపోయింది. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో టీవీకే అధినేత విజయ్ తో గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు ఈ ఈవెంట్ లో సినీనటి త్రిష ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తమ అభిమాన నటుడు విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం వేలాదిమంది అభిమానులు టీవీకే కార్యకర్తలు తరలివచ్చారు.

విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి పంచెకట్టులో కాకుండా సూట్ లో వచ్చారు. విజయ్ తో పాటు మొత్తం 9 మంది టీవీకే ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు మంత్రులుగా ఈరోజే ప్రమాణ స్వీకారం చేస్తారని ముందుగా ప్రచారం జరిగింది.

కానీ, మంత్రివర్గ విస్తరణలో మిత్ర పక్షాలకు అవకాశం ఇవ్వాలని విజయ్ భావించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.