పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. సభా వేదికపై ఉన్న 98 ఏళ్ల వృద్ధ నాయకుడు మఖన్లాల్ సర్కార్ వద్దకు స్వయంగా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆయనకు శాలువా కప్పి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ దృశ్యం సభలో ఉన్న వారినే కాకుండా సోషల్ మీడియాలో చూసిన వారినీ ఆకట్టుకుంది. దీంతో మఖన్లాల్ సర్కార్ ఎవరు? ఆయన ప్రత్యేకత ఏమిటి? అనే ఆసక్తి.మొదలైంది.
మఖన్లాల్ సర్కార్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, జనసంఘ్–బీజేపీ సిద్ధాంతాలకు జీవితాంతం అంకితమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. 1952లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన కశ్మీర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. ఆ కాలంలోనే జాతీయవాద భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. ఉత్తర బెంగాల్లో బీజేపీ బలోపేతానికి కీలకంగా పనిచేశారు.
1981 నుంచి వరుసగా ఏడేళ్ల పాటు జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు. పార్టీకి పెద్దగా బలం లేని రోజుల్లో గ్రామాగ్రామాన తిరిగి కార్యకర్తలను తయారుచేశారు. కేవలం ఒక్క ఏడాదిలోనే 10 వేల మందిని పార్టీలో చేర్పించి విశేష గుర్తింపు పొందారు.
పార్టీ కోసం జీవితాంతం కష్టపడిన అట్టడుగు స్థాయి కార్యకర్తలను బీజేపీ ఎప్పటికీ మరచిపోదనే సందేశాన్నే ప్రధాని మోదీ తన చర్యతో ఇచ్చారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. సాధారణ కార్యకర్త నుంచి జాతీయ స్థాయిలో గౌరవం పొందిన మఖన్లాల్ సర్కార్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…