పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి.. మమతా బెనర్జీ ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మమతకు ప్రజలు భారీ షాకిచ్చారు. తొలిసారి ఇక్కడ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. అయితే.. తాను ఓడిపోలేదని.. ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేసేది లేదని మమత భీష్మించారు.
రాజకీయంగా ఈ వ్యవహారం దుమారానికి దారితీసింది. అయితే.. ఈ నెల 7వ తేదీతో బెంగాల్ అసెంబ్లీ కాల పరిమితి ముగిసిపోవడంతో గవర్నర్ ఆర్.ఎన్. రవి.. అసెంబ్లీని రద్దు చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు కు ఆహ్వానించారు. దీంతో తాజాగా శనివారం ఉదయం బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ఇప్పటి వరకు తాను రాజీనామా చేసేది లేదని పేర్కొన్న మమత .. ఈ ప్రమాణ స్వీకారానికి కొద్ది సేపటి ముందు.. దాదాపు తన ఓటమిని అంగీకరించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లోని బయోలో భారీ మార్పు చేశారు. 15, 16, 17 శాసన సభల సభానేతను మాత్రమే అని పేర్కొన్నారు. దీంతో ఆమె ప్రస్తుత శాసనసభకు సభానేత(ముఖ్యమంత్రి) తాను కాదని ఒప్పుకొన్నట్టు అయింది. ఇక, ఇప్పటి వరకు ఆమె ఎక్స్ బయోలో.. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక చైర్మన్. బెంగాల్ ముఖ్యమంత్రి అని ఉంది. ఇప్పుడు దానిని తీసేయడం ద్వారా.. తాను తాజా ఎన్నికల్లో గద్దెదిగినట్టు ఆమె ఒప్పుకొన్నారు.
మళ్లీ పోటీ.. !
కాగా.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచి ఓడిపోయిన మమతా బెనర్జీ.. మరోసా రి తన అదృష్టాన్ని పరిశీలించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సువేందు.. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచారు. 1) నందిగ్రామ్. 2) భవానీపూర్. వీటిలో ఏదో ఒక నియోజకవర్గాన్ని ఆయన వదులుకుంటారు. దీంతో ఆ స్థానం నుంచి మమత పోటీ చేసి విజయం దక్కించుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆమె అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…