జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్ ఇంకో పాతిక రోజుల్లోనే ఉండటంతో ప్రమోషన్లు ఊపందుకోవాలంటే ముందీ లాంఛనం జరిగిపోవాలి. ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్ లో బజ్ పెరగాలంటే ఇది సక్సెస్ కావడం చాలా కీలకం. వృద్ధి, మైత్రి, సుకుమార్ రైటింగ్ బృందాలు ప్రస్తుతం ఈ ప్రణాళికలోనే ఉన్నాయి. భోపాల్ లో వేడుక నిర్వహించాలని ఫిక్స్ అయినట్టుగా గట్టిగా వినిపిస్తోంది.
భోపాల్ ఎందుకు ఎంచుకుంటున్నారనే ప్రశ్నకు సమాధానం లేకపోలేదు. గతంలో పుష్ప 2 ది రూల్ మొదటి ఈవెంట్ బీహార్ లో చేస్తామని ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అల్లు అర్జున్ కు ఫాలోయింగ్ ఉన్న కేరళ వదిలేసి ఇంకో చోటకి వెళ్లడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఊహించని విధంగా ఆ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బన్నీని ప్రత్యక్షంగా చూసిన జనాలు ఎగబడి వచ్చారు. నిర్వాహకులు ఊహించిన దానికన్నా గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
ఇప్పుడు పెద్దికి అలాంటి పుష్ కావాలి. చికిరి చికిరి పాట పుణ్యమాని చరణ్ ఉత్తరాదిలో బాగా చొచ్చుకుపోయాడు. ఆర్ఆర్ఆర్ టైంలోనే ఇమేజ్ వచ్చినప్పటికీ గేమ్ ఛేంజర్ వల్ల అది కొంచెం ప్రభావితం చెందింది. సో మళ్ళీ నార్త్ లో చరణ్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే గట్టిగా సౌండ్ చేయాలి. దానికి ట్రైలర్ లాంచ్ కన్నా మంచి వేదిక దొరకదు. భోపాల్ లో చేస్తే అక్కడి మీడియా కవరేజ్ తో పాటు హిందీ ప్రేక్షకుల మద్దతు దొరుకుతుంది.
ప్రస్తుతం పెద్ది ఓవర్సీస్ కలెక్షన్లతో సిక్సర్లు కొడుతున్నాడు. ఆల్రెడీ రెండు లక్షల డాలర్లకు దగ్గరగా ఉండగా మొదటి వీకెండ్ అయ్యేలోపు అర మిలియన్ వస్తుందని డిస్ట్రిబ్యూటర్ నమ్మకం. ఇంకా మూడు వారాలు టైం ఉంది కాబట్టి మూడు మిలియన్ ముద్ర పడుతుందనే ధీమాలో అభిమానులున్నారు. భోపాల్ లో జరిగే ఈవెంట్ మే 16 లేదా 17 ఉండొచ్చు. అధికారిక ప్రకటన ఏ క్షణమైనా వచ్చేలా ఉంది. ఇక్కడి నుంచి పబ్లిసిటీ నాన్ స్టాప్ గా ఉండాల్సిందే.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…