Movie News

పెద్ది భోపాల్ ఎందుకు ఎంచుకున్నాడు

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్ ఇంకో పాతిక రోజుల్లోనే ఉండటంతో ప్రమోషన్లు ఊపందుకోవాలంటే ముందీ లాంఛనం జరిగిపోవాలి. ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్ లో బజ్ పెరగాలంటే ఇది సక్సెస్ కావడం చాలా కీలకం. వృద్ధి, మైత్రి, సుకుమార్ రైటింగ్ బృందాలు ప్రస్తుతం ఈ ప్రణాళికలోనే ఉన్నాయి. భోపాల్ లో వేడుక నిర్వహించాలని ఫిక్స్ అయినట్టుగా గట్టిగా వినిపిస్తోంది.

భోపాల్ ఎందుకు ఎంచుకుంటున్నారనే ప్రశ్నకు సమాధానం లేకపోలేదు. గతంలో పుష్ప 2 ది రూల్ మొదటి ఈవెంట్ బీహార్ లో చేస్తామని ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అల్లు అర్జున్ కు ఫాలోయింగ్ ఉన్న కేరళ వదిలేసి ఇంకో చోటకి వెళ్లడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఊహించని విధంగా ఆ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బన్నీని ప్రత్యక్షంగా చూసిన జనాలు ఎగబడి వచ్చారు. నిర్వాహకులు ఊహించిన దానికన్నా గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

ఇప్పుడు పెద్దికి అలాంటి పుష్ కావాలి. చికిరి చికిరి పాట పుణ్యమాని చరణ్ ఉత్తరాదిలో బాగా చొచ్చుకుపోయాడు. ఆర్ఆర్ఆర్ టైంలోనే ఇమేజ్ వచ్చినప్పటికీ గేమ్ ఛేంజర్ వల్ల అది కొంచెం ప్రభావితం చెందింది. సో మళ్ళీ నార్త్ లో చరణ్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే గట్టిగా సౌండ్ చేయాలి. దానికి ట్రైలర్ లాంచ్ కన్నా మంచి వేదిక దొరకదు. భోపాల్ లో చేస్తే అక్కడి మీడియా కవరేజ్ తో పాటు హిందీ ప్రేక్షకుల మద్దతు దొరుకుతుంది.

ప్రస్తుతం పెద్ది ఓవర్సీస్ కలెక్షన్లతో సిక్సర్లు కొడుతున్నాడు. ఆల్రెడీ రెండు లక్షల డాలర్లకు దగ్గరగా ఉండగా మొదటి వీకెండ్ అయ్యేలోపు అర మిలియన్ వస్తుందని డిస్ట్రిబ్యూటర్ నమ్మకం. ఇంకా మూడు వారాలు టైం ఉంది కాబట్టి మూడు మిలియన్ ముద్ర పడుతుందనే ధీమాలో అభిమానులున్నారు. భోపాల్ లో జరిగే ఈవెంట్ మే 16 లేదా 17 ఉండొచ్చు. అధికారిక ప్రకటన ఏ క్షణమైనా వచ్చేలా ఉంది. ఇక్కడి నుంచి పబ్లిసిటీ నాన్ స్టాప్ గా ఉండాల్సిందే.

Kumar

Recent Posts

1500 కోట్ల భూ క‌బ్జా కేసు.. ప‌రారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

వైసీపీ అధికారంలో ఉండ‌గా.. ఆపార్టీకి చెందిన నాయ‌కులు అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…

42 minutes ago

విజయవాడ మ్యాచులో బౌండరీ దాటాల్సిందే

పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…

1 hour ago

కర్ణాటక సీఎం మార్పు… ఢిల్లీలో షర్మిల

దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…

3 hours ago

క‌డ‌ప‌పైనే పసుపు సేన దృష్టి

రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…

8 hours ago

జూన్ నెలలో విజయ్…….జూలైలో జూనియర్ విజయ్

కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…

9 hours ago

కెప్టెన్‌గా రిష‌బ్ పంత్ ఔట్‌

రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్ల‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీం సొంత‌మైన ఆట‌గాడు రిష‌బ్ పంత్.…

9 hours ago