ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర ఫలితాలు నమోదయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా మారిపోతున్నాయి. ప్రత్యేకించి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒకటి, అరా ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేసినట్లుగా సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా దూసుకుపోతున్నారు. విజయ్ పార్టీ తమిళ వెట్రిగ కజగం (టీవీకే)… అటు అధికార డీఎంకే, ఇటు ప్రతిపక్షం అన్నాడీఎంకేలను కిందకు నెట్టేసి రాకెట్ లా దూసుకుపోతోంది.
ఉదయం 11 గంటల సమయానికి విజయ్ పార్టీ ఏకంగా 130 సీట్లలో ఆధిక్యం సాధించింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా… ఎర్లీ ట్రెండ్స్ లో టీవీకే ఏకంగా 108 సీట్లలో ఆదిక్యంలో కొనసాగుతోంది. ఇక మరోమారు అధికారం ఖాయమని మెజారిటీ సర్వే సంస్థలు చెప్పిన డీఎంకే మూడో స్థానంలో కదులుతోంది. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రస్తుతానికి కేవలం 50 సీట్లలోనే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక ఈ దఫా విజయం ఖాయమని భావించిన అన్నాడీఎంకే… విజయ్ పార్టీకి అల్లంత దూరాన నిలుస్తూ 76 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది.
ఈ ఎర్లీ ట్రెండ్స్ చివరి దాకా కొనసాగితే…తమిళనాడు రాజకీయ చరిత్రలోనే కాకుండా భారత దేశ రాజకీయ చరిత్రలోనే మరో రికార్డు లిఖితం కానుంది. సినిమాల నుంచి నేరుగా రాజకీయాల్లోకి వచ్చి విజయాలు సాధించిన వారు ఇప్పటిదాకా ఇద్దరే ఉన్నారు. వారిలో ఎంజీఆర్ తమిళనాడులో విజయం సాధిస్తే… ఎన్టీఆర్ ఏపీలో రికార్డు విజయాన్ని అందుకున్నారు. వీరి తర్వాత చాలా మంది సినిమా స్టార్లు రాజకీయాల్లోకి వచ్చినా… వారంతా బొక్కబోర్లా పడిపోయారు. తాజాగా తమిళనాడు రాజకీయ యవనికలో సునామీలా దూసుకువచ్చిన విజయ్… ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే… ఎంజీఆర్, ఎన్టీఆర్ సరసన ఆయన చోటు దక్కించుకోనున్నారు.
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…
రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ టీం సొంతమైన ఆటగాడు రిషబ్ పంత్.…
ఏపీ సీఎం చంద్రబాబు.. గత వారం రోజులుగా మహానాడు నిర్వహణపై దృష్టి పెట్టారు. ఇదేసమయంలో పాలన పరంగా కూడా సమీక్షలు..…
మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు సైతం రీ రిలీజ్ లోనూ రికార్డులు సృష్టించడం చూశాం. ముఖ్యంగా ఖలేజాని చూసుకుంటే దానికొచ్చిన…