తమిళనాడు ఎన్నికల ముంగిట రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యక్తి పేరు బాగా చర్చనీయాంశం అయిందే. ఆ పేరు ఇంకేదో కాదు.. త్రిష. తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన విజయ్తో త్రిష సన్నిహితంగా మెలగడమే అందుక్కారణం. తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డ విజయ్.. కొన్నేళ్ల నుంచి త్రిషతోనే కలిసి ఉంటున్నాడని స్పష్టమైంది.
ఎన్నికలు సమీపిస్తుండగా.. తమ గురించి జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ ఈ ఇద్దరూ ఒక పెళ్లి వేడుకకు కలిసి హాజరవడం ఎంత హాట్ టాపిక్ అయిందో తెలిసిందే. ఇక అప్పట్నుంచి విజయ్ ప్రస్థానంలో త్రిష పాత్ర ఎలా ఉంటుందో అని అందరూ చర్చించుకుంటున్నారు. కాగా ఈ రోజు ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలోనే త్రిష తిరుమలలో ప్రత్యక్షం కావడంలో అందరి దృష్టీ అటు మళ్లింది.
విజయ్ కోసం శ్రీవారిని ప్రార్థించడానికే త్రిష తిరుమలకు వచ్చిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం మొదలైంది. కానీ ఇది నిజం కాదని ముందు నుంచి త్రిషను ఫాలో అవుతున్న వారికి అర్థమవుతుంది. మే 4న త్రిష పుట్టిన రోజు. తన ప్రతి బర్త్ డేకీ త్రిష తిరుమలకు వస్తుంది. ఈ విషయం తన అభిమానులకు తెలుసు.
ఐతే ఇప్పుడు యాదృచ్ఛికంగా త్రిష పుట్టిన రోజు నాడే మరో నాలుగు రాష్ట్రాలతో కలిపి తమిళనాడు ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తున్నారు. దీంతో చరిత్ర మరిచిపోయి విజయ్ కోసమే త్రిష తిరుమలకు వచ్చిందంటూ లింక్ పెట్టి మాట్లాడేస్తున్నారు. ఆమె వీడియోలను వైరల్ చేస్తున్నారు.
ఐతే విజయ్తో బంధం దృష్ట్యా అతను ఎన్నికల ఫలితాల్లో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో త్రిష చాలా సంతోషంగా ఉండి ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ తన కోసమే తిరుమలకు వెళ్లిందని అబద్ధపు ప్రచారాలు చేయడం మాత్రం తప్పు. ఈ రోజు విజయ్ ప్రభావం చూపకపోయినా త్రిష తిరుమలకు వెళ్లేదన్నది వాస్తవం.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…