Political News

అజహరుద్దీన్ మినిస్ట్రీపై వీడిన సస్పెన్స్

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారంపై మూడేళ్లుగా వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ తో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ నామినేషన్లను గవర్నర్ ఆమోదించలేదు. మరోవైపు, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రిగా అజహరుద్దీన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 6 నెలలు పూర్తి కావస్తోంది. అజ్జు భాయ్ మంత్రి పదవి చేపట్టి ఈ ఏప్రిల్ 30 నాటికి 6 నెలలు పూర్తవుతుంది.

ఈ లోపు ఎమ్మెల్సీగా అజహరుద్దీన్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుంటే మంత్రి పదవి కోల్పోయే ఛాన్స్ ఉంది. ఈ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డికి చిక్కులు తెచ్చి పెట్టింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లాతో రేవంత్ భేటీ అయ్యారు. అజారుద్దీన్, కోదండరామ్‌ల ఎమ్మెల్సీ నామినేషన్ ఫైల్‌ను ఆమోదించాలని గవర్నర్ శుక్లాకు విజ్ఞప్తి చేశారు. అయితే, గవర్నర్ ఆ ఇద్దరికీ లైన్ క్లియర్ చేస్తారా లేదా అన్న విషయంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ ఏర్పడింది.

ఆ సస్పెన్స్ కు తెర దించుతూ అజహరుద్దీన్, కోదండరాంలకు గవర్నర్ శుక్లా పచ్చజెండా ఊపారు. రేవంత్ కేబినెట్ ప్రతిపాదించిన అజారుద్దీన్, కోదండరాం అభ్యర్థిత్వాలను ఆమోదిస్తూ గవర్నర్ శుక్లా సంతకం చేశారు. త్వరలోనే అందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.

ఒక వేళ ఏప్రిల్ 30లోపు ఆ ఇద్దరి నామినేషన్ ను గవర్నర్ శుక్లా ఆమోదించకుంటే అజహరుద్దీన్ తో రాజీనామా చేయించి మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని కూడా రేవంత్ ఆలోచించారట. ఆ అవసరం లేకుండానే మార్గం సుగమం కావడంతో రేవంత్ తో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఊపిరి పీల్చుకున్నాయి.

This post was last modified on April 25, 2026 3:06 pm

Share

Recent Posts

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

29 minutes ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

2 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

3 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

10 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

11 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

12 hours ago