Political News

క్వాంటం కంప్యూటింగ్‌లో మనదే తొలి అడుగు

అమ‌రావ‌తిలో ఏర్పాటు చేయ‌నున్న క్వాంటం కంప్యూటింగ్‌లో తొలి అడుగు విజ‌య‌వంతంగా ప‌డింద‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. రాజ‌ధాని అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ, గన్నవరంలోని ఓ కేంద్రంలో ఏర్పాటు చేసిన `క్వాంటం టెస్ట్‌బెడ్స్‌`ను మంగ‌ళ‌వారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. 1ఎస్‌, 1క్యూ క్వాంటం టెస్ట్‌బెడ్స్‌ను ప్రారంభించిన అనంత‌రం.. వాటిని జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ ఏడాది చివ‌రి నాటికి రాజ‌ధానిలో క్వాంటం వ్యాలీని పూర్తిస్థాయిలో ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు.

ఇంటికో పారిశ్రామిక‌వేత్త‌..

ఇంటికో పారిశ్రామిక వేత్త నినాదంతో త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. అదేవిధంగా విధానాల‌ను రూపొందిస్తున్న‌ట్టు తెలిపారు. అలాగే.. ఆవిష్క‌ర‌ణ‌ల రంగాన్ని అంద‌రికీ చేరువ చేస్తున్న‌ట్టు చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రికీ ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)ను అందుబాటులోకి తీసుకువ‌స్తున్న‌ట్టు తెలిపారు. త‌ద్వారా.. సాంకేతిక‌త‌ను కొత్త పుంత‌లు తొక్కిస్తామ న్నారు. 45 ల‌క్ష‌ల మందిని ఏఐ, క్వాంటం, వైజర్ డేటా సెక్యూరిటీలో నిపుణులుగా మారుస్తామని వివ‌రించారు. కేవ‌లం సాంకేతి క‌త‌ను అనుస‌రించ‌డ‌మే కాకుండా.. సాంకేతిక రంగంలో ఏపీ ప్ర‌త్యేక ఆవిష్క‌ర‌ణ‌ల‌కు కేంద్రంగా కూడా ఉంటుంద‌న్నారు.

డిసెంబరు నుంచి రాజ‌ధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రారంభమవుతుందని.. దీంతో ప్ర‌పంచ‌స్థాయికి రాజ‌ధాని ప్రాధాన్యం పెరుగుతుంద‌న్నారు. ఒక కుటుంబం-ఒక పారిశ్రామిక‌వేత్త విధానం కింద‌.. ప్ర‌తి వెయ్యి కుటుంబాల నుంచిఒక స్టార్ట‌ప్‌ను ప్రోత్స‌హించ‌నున్న‌ట్టు చెప్పారు.  దీనికిగాను ప్ర‌ముఖ విద్యా సంస్థ‌లైన ఐఐటీ చెన్నై, ఐబీఎం సంస్థల భాగస్వామ్యం తీసుకుంటా మన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లోనూ సాంకేతిక విప్ల‌వం ఏఐ విప్ల‌వం వంటివి మ‌రింత‌గా పెరగ‌నున్నాయ‌ని తెలిపారు. వాటిని అందిపుచ్చుకుని.. వైద్య‌, ఔషధాల ఆవిష్కరణ, వ్యవసాయ ఉత్పాదకత, రక్షణ పరిశోధన, లాజిస్టిక్స్ రంగాల‌ను బ‌లోపేతం చేయ‌నున్న‌ట్టు చెప్పారు.

This post was last modified on April 14, 2026 9:49 pm

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

3 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

7 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

11 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

11 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

12 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

12 hours ago